Sunday, March 29, 2026
E-PAPER
Homeసోపతి'మెటానమీ' కవిత్వ సంక్లిష్టతను ఛేదించగలదా?

‘మెటానమీ’ కవిత్వ సంక్లిష్టతను ఛేదించగలదా?

- Advertisement -

కవయిత్రి రామా రత్నమాల వచన కవితలు, నిక్కూలు, మణి పూసలు, కథలు, వ్యాసాలు రాస్తున్నరు. పింగిళి ప్రభుత్వ మహిళా కళాశాల (అటానమస్‌), హనుమకొండలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (తెలుగు) గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నరు. సమకాలీన అంశాలపై ఎప్పటికప్పుడు సజనాత్మక రచనలు చేస్తూ కళాశాల విద్యార్థినులకు ఆదర్శంగా నిలుస్తున్న ‘రామా రత్నమాల’ ప్రస్తుత యుద్ధ సంక్షోభ నేపథ్యం నుంచి రాసిన ‘శాంతిగీతం’ కవిత గురించి చర్చించుకుందాం. స్త్రీ గొంతుకను బలంగా వినిపిస్తూ ‘మా అస్తిత్వానికి అడ్డొస్తే నిన్ను అష్ట దిగ్భందనం చేసే వ్యూహం మేమే రచిస్తాం’ అని హెచ్చరికలు జారీచేసిన కవయిత్రి ‘వస్తువు’ మారినపుడు తన కవిత్వ నిర్మాణ శిల్పాన్ని ఎలా రూపొందిస్తదో తెలుసుకోవడం ముఖ్యం.

”శాంతి గీతం’ అనే శీర్షికను ఎంచుకున్నప్పుడు కవిత చదవకుండానే కవయిత్రి ఏం చెప్పదల్చుకుంటుందో ఒక అంచనాకు రావచ్చు. శాంతి గీతం ఆలపించడంలో యుద్ధాన్ని వ్యతిరేకించడం, హింసను ప్రేరేపించే వ్యూహాల్ని నిరసించడం, సుహద్భావ వాతావరణాన్ని కోరుకోవడం వంటివి కవయిత్రి దక్పథాన్ని స్పష్టపరుస్తయి. ఎత్తుగడ ‘కాలం’ ప్రస్తావనతో ప్రారంభమైతది. అమూర్తమైన వస్తువును మూర్త అంశాలతో పోలికలు చెప్పడం కనిపిస్తది. కాలాన్ని ‘కనిపించని నది’, ‘ఆగని నిశ్శబ్ద ప్రవాహం’ అనటంలోని ఔచిత్యాన్ని; కాలం, నది రెండింటి స్వరూపాల్ని మేళవించటం ద్వారా సాధారణ అంశం కవిత్వమెలా అవ్వగలదో గ్రహిస్తాం.
మనిషి మనః సంఘర్షణను చెప్పటానికి మనిషి అంతరంగాన్ని ‘మైదానం’ తో, ‘రణభూమి’ తో పోలికలు చెప్పడం ద్వారా ఓటమి గెలుపుల్ని పరిచయం చేస్తది. కాలం, మనిషి అంతరంగంతో పాటుగా ‘అరిషడ్వర్గాల’ వల్ల జీవితం ఎలా ధ్వంసమైతదో చిత్రీకరిస్తది. మనిషి నుండి సమాజం దిశగా కొనసాగుతూ యుద్ధం, ఆధిపత్య భావనలు ఎట్ల మానవత్వాన్ని దహించి వేస్తాయో చెబుతూ వసుధైక కుటుంబ భావనను ప్రవేశపెట్టడం పరిశీలిస్తాం. అమెరికా- ఇరాన్‌ యుద్ధానికి గల కారణాల అన్వేషణ యిందులో చూడొచ్చు. మోక్షాన్ని పొందడానికి అంతర్గత శత్రువులైన కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం మొ.న ఆరింటిని జయించాలని చెబుతుంటరు. కవిత్వ నిర్మాణం అరిషడ్వర్గాలను ప్రవేశపెట్టడం ద్వారా ‘యుద్ధవ్యతిరేకత’ ను చెప్పడం తద్వారా ప్రపంచ శాంతిని కాంక్షించడం ప్రధాన ఉద్ధేశ్యంగా చెప్పవచ్చు. ‘కామం’ కారుమబ్బులతో, ‘లోభం’ ఎడారితో, ‘క్రోధం’ గాలివానతో, ‘మోహం’ ‘పొగమంచు’తో, ‘మాత్సర్యం’ విషబిందువుతో పోలికలు చెప్పడం; మదం (అహంకారం) అణువణువున నిండడంగా చెప్పడంతో ఏయే పరిణామాలు విపరీతమైతయో పూర్వ రంగాన్ని సిద్ధపరిచి; అక్కడనుండి ప్రపంచ రాజకీయాల వైపు కవితను మలుపు తిప్పడంలోని నిర్మాణ వ్యూహాన్ని పసిగట్టగలుగుతాం.
కవయిత్రి ‘మెటానమీ’ ని బలంగా ప్రవేశపెట్టడం ద్వారా అంతర్జాతీయ యుద్ధ సన్నాహాల్ని, వాటి మార్పు కోసం నడవాల్సిన సామరస్య మార్గాల్ని వెతికి చూపెడుతది. ప్రతీకల్ని సరిగా అర్థం చేసుకోగలిగితేనే కవిత్వ సారాంశం బోధపడుతది. ‘గోధుమరంగు ఎలుగుబంటి, స్టార్‌ ఆఫ్‌ డేవిడ్‌, అట్లాంటిక్‌ తీరంలోని స్వేఛ్ఛా ప్రతిమ’ మొ.నవి వేటిని సూచిస్తున్నాయో; ప్రతక్షంగా, పరోక్షంగా యుద్ధానికి కాలుదువ్వుతున్న ఏయే దేశాల్ని ప్రస్తావిస్తున్నాయో తెలుసుకోవడం ద్వారా కారకులు ఎవరో పరోక్షంగా సూచిస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు.
చెప్పదల్చుకున్న విషయాన్ని దానికి సంబంధం వున్న మరో అంశాన్ని ప్రవేశపెట్టడం ద్వారా ధ్వనింపజేయడం ‘మెటానమీ’ ద్వారా సమర్థవంతంగా నిర్వహించవచ్చనే వ్యూహాన్ని కవయిత్రి అవలంభించింది. ఒక్కో సారి సంక్లిష్టమైన ప్రతీకల్ని వాడినపుడు కవి ఉద్ధేశ్యం నెరవేరదు. ఉదాహరణకు ‘గోధుమరంగు ఎలుగుబంటి’ రష్యాను కాకుండా ‘ఫిన్లాండ్‌ ‘ను సూచించడంగా ‘పాఠకులు అర్థం చేసుకుంటే ‘కవిత’ పూర్తిగా తన ఆశయాన్ని నెరవేర్చుకోలేదు. కవులు ‘మెటానమీ’ ని చాలా జాగ్రత్తగా ప్రయోగించాల్సి వుంటది. పాఠకులు సైతం అంతే తీక్షణతతో అర్థం చేసుకోవాల్సి వుంటది.

శాంతి గీతం
కాలం ఎప్పుడూ కనిపించని నదిలా
ఆగని నిశ్శబ్ద ప్రవాహమై
జీవిత తీరాలను స్పశిస్తుంది
మనిషి అంతరంగ మైదానం నిత్యం
ఒక రణ భూమియై ఓటమి, గెలుపుల చరిత్రను రాస్తుంది
కామం కారుమబ్బై మనసు ఆకాశంలో కదలాడితే
ధర్మం దారి తప్పి బతుకులను ఛిద్రం చేస్తుంది
కోపం గుండెలో గాలివానై విరుచుకు పడితే
బంధాల వక్షాలు నేలకూలి విచ్ఛిన్నమవుతాయి
లోభం ఎడారిలా విస్తరిస్తే పంపకాల ఒయాసిస్సులు
మాయమై సంకుచితత్వానికి చిరునామాగా నిలుస్తుంది
మోహం పొగ మంచై కమ్ముకుంటే
వివేకపు అడుగులు తడబడుతాయి
అహంకారం అణువణువున నిండితే
నిజం కళ్ళముందు నిలిచినా కనబడదు
అసూయ విషబిందువై చిమ్మితే
ఇతరుల ఆనందం గాయమై బాధిస్తుంది
ఇలా… అరిషడ్వర్గాల అడుగుజాడల్లో నడిచినప్పుడు
మనిషితనం ఎండమావిలా మారుతుంది
మదిలో చెడు గుణాల ముళ్ళు వాడిపోయి
పరిమళించే పూలవనంతో మెరవాలి
మంచు నేలల్లో గోధుమ రంగు ఎలుగుబంటి
యుద్ధ గర్జన కాకుండా స్నేహ స్వరం వినిపించాలి
‘స్టార్‌ ఆఫ్‌ డేవిడ్‌’ వెలుగు విభేదాల చీకట్లను చీల్చి
సౌహార్ద ఉదయాలకు స్వాగతం పలకాలి
క్షిపణులతో విధ్వంసం సష్టించకుండా
అట్లాంటిక్‌ తీరంలో స్వేచ్ఛా ప్రతిమ చేతిలోని దీపం
వెలుగుతో సామరస్య మార్గంలో నడవాలి
మానవత్వం యుద్ధోన్మాదంలో దగ్ధమై
కన్నీళ్లు, నెత్తుటేర్లు పారించి
భూమి గుండెలో మానవ కళేబరాల దిబ్బయై పడుతోంది
జాతి మత భేదాల గోడలు కూలి
ఆధిపత్య భావన నశించి
ప్రతి హదయంలో మానవతా రాగం పల్లవించి
ప్రపంచమంతా ప్రతిధ్వనించేలా శాంతి గీతం పాడాలి
మనిషి మనిషికి మధ్య మమతా వంతెనతో
నవవసంతాల వెలుగుల్లో
జగమంతా ఒకే కుటుంబమై నిలవాలి!

– బండారి రాజ్‌ కుమార్‌, 8919556560

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -