వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య
నవతెలంగాణకు 11వ వార్షికోత్సవ శుభాకాంక్షలు
నిజాన్ని నిర్భయంగా రాయడం.. ప్రజల సమస్యలపై ప్రశ్నించడం.. ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా ప్రజల పక్షాన నిలుస్తూ ‘నవతెలంగాణ’ తన ప్రస్థానాన్ని కొనసాగించడం అభినందనీయం. ఒక పత్రిక 11 ఏండ్ల పాటు తన ప్రస్థానాన్ని కొనసాగించి 12వ సంవత్సరంలోకి అడుగుపెట్టడం నేటి పరిస్థితుల్లో సాధారణ విషయం కాదు. భవిష్యత్తులోనూ నవతెలంగాణ మరింతగా అభివృద్ధి చెంది ప్రజల ఆదరణను చూరగొనాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడే బాధ్యతాయుతమైన పాత్రికేయతకు ‘నవతెలంగాణ’ మరింత బలం చేకూర్చాలి. ప్రజల గొంతుకగా నిలుస్తున్న నవతెలంగాణ దినపత్రిక 11వ వార్షికోత్సవం సందర్భంగా పాఠకులకు, యాజమాన్యానికి, సంపాదక వర్గానికి, జర్నలిస్టులకు, సిబ్బందికి హృదయపూర్వక శుభాకాంక్షలు.
ప్రజల పక్షాన నిలిచే పత్రికలే ప్రజాస్వామ్యానికి బలం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



