- Advertisement -
నవతెలంగాణ-అచ్చంపేట
పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో నాగర్ కర్నూలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా అంధత్వ నియంత్రణ సంస్థ మహబూబ్ నగర వారి ఆధ్వర్యంలో సోమవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. కంటి వైద్య నిపుణులు డాక్టర్. కమల 65 మంది కంటి రోగులను పరీక్షించి 45 మందిని కంటి శుక్లాల ఆపరేషన్ చేయవలసి ఉందని ఎంపిక చేశారు. వారిని ప్రత్యేక అంబులెన్స్ లో కందూరు రామ్ రెడ్డి లయన్స్ కంటి ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ శిబిరంలో విశ్రాంత ఆప్తాలమిక్ అధికారి సిహెచ్. గణేష్, ఆస్పత్రి వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



