– సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
మూసీ విషపు జలాల నుండి పోచంపల్లి ప్రాంత ప్రజలను, రైతులను విముక్తి కల్పించడానికి కొండపోచమ్మ ప్రాజెక్టు నుండి శామీర్ పేట చెరువులోకి గోదావరి జలాలు తెచ్చి షామీర్ పేట చెరువు నింపి ఆచెరువు నుండి ఘట్కేసర్ మండలం ఏదులబాద్ చెరువు నింపి అక్కడి నుండి మూసీ కావలోకి గోదావరి జలాలు మల్లించి పోచంపల్లి ప్రాంతంలోని రైతాంగానికి సాగునీరు అందించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన పోచంపల్లి పట్టణంలోని మెహర్ నగర్ గ్రామంలో నిర్వహించిన ఇంటింటికి సీపీఐ(ఎం) ఈ కార్యక్రమంలో హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, మాజీ డివిజన్ కార్యదర్శి గూడూరు అంజిరెడ్డి, మండల కార్యదర్శి కోట రామచంద్రారెడ్డి, టౌన్ కార్యదర్శి దుబ్బాక జగన్, శాఖ కార్యదర్శి గూడూరు రాంరెడ్డి, టౌన్ కమిటీ సభ్యులు వడ్డెపల్లి యాదగిరి, నాయకులు గూడూరు క్రిష్ణా రెడ్డి, సామల సత్తిరెడ్డి, రామస్వామి అంజిరెడ్డి లు పాల్గొన్నారు.
పోచంపల్లి ప్రాంతానికి గోదావరి జల్లాలు అందించాతలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



