Wednesday, April 1, 2026
E-PAPER
Homeతాజా వార్తలుట్యాంక్ బండ్ శివకు అండ‌గా రాష్ట్ర ప్ర‌భుత్వం

ట్యాంక్ బండ్ శివకు అండ‌గా రాష్ట్ర ప్ర‌భుత్వం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఆపదలో ఉన్న వందలాది మందికి పునర్జన్మ ప్రసాదించిన ‘ట్యాంక్ బండ్ శివ’కు రాష్ట్ర ప్రభుత్వం అండ‌గా నిలిచింది. ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో ఇబ్బందుల్లో ఉన్న ఆయ‌న కుటుంబానికి రూ. ఐదు ల‌క్ష‌ల ఆర్థిక సాయాన్ని అంద‌జేసింది. ఆ మొత్తాన్ని తక్షణమే అందజేసింది. కేవలం ఆర్థిక సాయంతోనే సరిపెట్టకుండా, ఆ కుటుంబానికి శాశ్వత ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో శివ కుమారుడు వేణుమాధవ్‌కు ‘హోం గార్డు’గా ఉద్యోగ నియామక పత్రాన్ని కూడా అందజేశారు. తన సుదీర్ఘ అనుభవాన్ని ఉపయోగించుకుని నలుగురికి ఈత నేర్పిస్తూ జీవనం సాగించేందుకు ట్యాంక్ బండ్ సమీపంలోనే ఒక స్విమ్మింగ్ పూల్ నిర్మించి ఇవ్వాలని శివ కోరగా, ఆ దిశగా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. వీటికి తోడు, నిలువనీడ లేని ఆ కుటుంబానికి ఒక ‘ఇందిరమ్మ ఇల్లు’ మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -