నవతెలంగాణ – బల్మూరు : మండల పరిధిలోని శ్రీ ఉమామహేశ్వరి ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో ఈనెల 6న జాబ్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ పరంగి రవి తెలిపారు. నిర్మాణ్ ఆర్గనైజేషన్ హైదరాబాదు వారి ఆధ్వర్యంలో భారీ జాబ్ డ్రైవ్ నిర్వహించబడనున్నదని ఈ జాబ్ డ్రైవ్లో హైదరాబాద్కు చెందిన ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నాయని తెలిపారు. 10వ తరగతి నుంచి పీజీ వరకు చదివిన విద్యార్థులు, అలాగే ఐటిఐ, డిప్లొమా, బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జాబ్ డ్రైవ్కు హాజరయ్యే అభ్యర్థులు తమ విద్యార్హత సర్టిఫికెట్లు మరియు రెస్యూమ్లను వెంట తీసుకురావాలని మరియు అభ్యర్థుల వయస్సు పరిమితి 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలని తెలిపారు. ఈ అవకాశాన్ని అర్హులైన యువతీ యువకులు అందరూ వినియోగించుకోవాలని కాలేజీ ప్రిన్సిపాల్ పరంగి రవి కోరారు. ఫోన్ ద్వారా వివరాలు తెలుసుకోవాలని అనుకునేవారు క్రింది నంబర్లకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు.
70750 55878,
81860 64771.
6న డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



