నవతెలంగాణ-నెల్లికుదురు
మండల కేంద్రంలోని నూతనంగా ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో 23 దరఖాస్తు వచ్చాయని ట్రైనింగ్ డిప్యూటీ కలెక్టర్ నితీష్ ఎంపీడీవో కుమార్ తెలిపారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నూతనంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మండల ప్రజలు వివిధ రకాల సమస్యలతో వచ్చి ఇబ్బందులు పడవద్దు అనే ఉద్దేశంతో టెంటును ఏర్పాటు చేసి వారు కూర్చోవడానికి కుర్చీలు కూడా ఏర్పాటు చేశామని తెలిపారు దీంతోపాటు ప్రజలు వివిధ రకాలైన సమస్యలతో వివిధ శాఖలకు సంబంధించిన విషయాలపై ప్రజావాణి కార్యక్రమానికి దరఖాస్తు చేసుకున్న క్రమంలో వెంటనే సంబంధిత శాఖకు ఆన్లైన్ చేసి పంపించామని తెలిపారు.
అందులో ఇక్కడే వెంటనే 5 శాఖలకు సంబంధించిన సమస్యలను తక్షణమే పరిష్కరించామని దీంతో ప్రజావాణికి వచ్చిన ప్రజలు ఆనంద వ్యక్తం చెందాలని అన్నారు. ఇందులో ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్న 18 దరఖాస్తులు వివిధ రకాలైన శాఖలు పి ఆర్ ఏ ఈ కి సంబంధించిన ఒక దరఖాస్తు, రెవెన్యూ శాఖ సంబంధించిన ఏడు దరఖాస్తులు, హౌసింగ్ శాఖకు సంబంధించిన నాలుగు దరఖాస్తులు, ఎంఈఓ విద్యకు సబంధించిన ఒక దరఖాస్తు, ఎంపీ ఓ, ఎంపీడీవోకు సంబంధించిన రెండు దరఖాస్తు, విద్యుత్తుకు సంబంధించిన ఒక దరఖాస్తు, ఐబి కి సంబంధించిన ఒక దరఖాస్తు మొత్తం 18 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ చందా నరేష్ తో 25 రకాల వివిధ శాఖల అధికారులు హాజరయ్యారని తెలిపారు.



