- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
భూగర్భజలాలు పెంపొందించదానికి రైతులు తమ వ్యక్తిగత భూముల్లో పామ్ పండ్ (నీటిగుంటలు) తవ్వకాలకు దరఖాస్తులు చేసుకోవాలని ఎంపిడిఓ క్రాంతికుమార్, ఎపిఓ హరీష్ సూచించారు. ఎల్నిఓ ప్రభావంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలసిరి కార్యక్రమంలో భాగంగా గ్రౌoడ్ వాటర్ పెంచడం కోసం ప్రభుత్వం విబిజి రామ్ జి నిధుల నుంచి రూ.1.80 లక్షల మంజూరు చేయునట్లుగా తెలిపారు. ఇందులో భాగంగా సోమవారం ఎంపిడిఓ, ఎపిఓ, తాడిచెర్ల గ్రామ సర్పంచ్ బండి స్వామి, బుర్ర రాజేష్, బుర్ర శ్రీనివాస్ రైతుల వ్యక్తిగత భూముల్లో పామ్ పండ్ పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విబిజి రామ్ జి సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
- Advertisement -


