- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
ప్రజల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ఎంతో ఆసరాగా పనిచేస్తుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధరాస్ సాయిలు అన్నారు. జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీ కాంతరావు కృషి ఫలితంగా జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్ మండలానికి 24 చెక్కులు మంజూరైనట్లు ఆయన తెలిపారు. ఈ చెక్కులను శుక్రవారం అంతాపూర్, లచ్చన్ ,హెచ్ కెలూరు, మద్నూర్ గ్రామాల లబ్దిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి సంతోష్ పటేల్, దన్నూర్ గ్రామ సర్పంచ్ కుటుంబా దేవిదాస్ పటేల్, లచ్చన్ సర్పంచ్ సంజు, హెచ్ కేలూరు సర్పంచ్ జి లక్ష్మణ్, అంతాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దత్తు లబ్ధిదారులు పాల్గొన్నారు.
- Advertisement -



