- Advertisement -
నవతెలంగాణ – నవాబు పేట: ఆదివారం నవాబుపేట మండల కేంద్రానికి సంత కొరకు అంగడి చుట్టుముట్టు గ్రామాల నుండి, తండాల నుండి దాదాపు 70 గ్రామాల నుండి వచ్చే ప్రజల కొరకు జెకె ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత భోజనం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా జేకే ట్రస్ట్ చైర్మన్ నర్సింహ చారి మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని అన్నారు. అదే విధంగా ఉదయం 6:30 గంటలకు ఫతేపూర్ కాకర్లపాడు మైసమ్మ దేవత ఆలయం దగ్గర వానర సమూహమునకు కోతులకు పండ్లు ఆహారముగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు సుధాకర్ చారి, పుట్టి అంజయ్య, నిరంజన్, శాంతయ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -