నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం నియోజకవర్గ పరిధిలోని మండల విద్యాశాఖ అధికారులు, వైద్యాధికారులతో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత రావు ఉన్నత స్థాయి సమీకక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మౌలిక వసతులు, నాణ్యమైన విద్య, పదో తరగతి ఫలితాల మెరుగుదల, పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం అందించాలని ఆదేశించారు.
వైద్యశాఖ అధికారులతో పీహెచ్సీల్లో సరిపడా మందుల లభ్యత, సీజనల్ వ్యాధుల నివారణ చర్యలు, గర్భిణీలు-చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని సూచించారు. పేదలకు మెరుగైన విద్య, నాణ్యమైన వైద్యాన్ని అందించడమే మన ప్రథమ కర్తవ్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.



