- Advertisement -
నవతెలంగాణ-ఆలేరు టౌన్
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ తుల ఉమ రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత వారిద్దరినీ ఆత్మీయంగా పలకరించి ఆశీర్వదించారు. వారికి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ కట్టిన మహిళా నేతలిద్దరినీ కేసీఆర్ దంపతులు చీర సారెతో సత్కరించి దీవించారు.
- Advertisement -



