Wednesday, April 15, 2026
E-PAPER
Homeజాతీయంహార్ముజ్‌ మూసివేతతో... చమురు సరఫరాలకు తీవ్ర అంతరాయం

హార్ముజ్‌ మూసివేతతో… చమురు సరఫరాలకు తీవ్ర అంతరాయం

- Advertisement -

ఆసియాలో సంక్షోభం తప్పదంటున్న నిపుణులు
న్యూఢిల్లీ :
ఇరాన్‌ ఓడరే వులు, కోస్తా ప్రాంతాలలో వాణిజ్య నౌకల రాకపోకలను అమెరికా సైన్యం సోమవారం నుంచి అడ్డుకుంటోంది. అంతర్జాతీయ మార్కెట్లకు నిన్నటి వరకూ ప్రతి రోజూ రెండు మిలియన్‌ బ్యారల్స్‌ ఇరాన్‌ చమురు (సుమారు 310 మిలియన్‌ లీటర్ల ముడి చమురు) సరఫరా అయ్యేది. అమెరికా చర్యతో ఇప్పుడది నిలిచిపోయింది. కెప్లర్‌ డేటా ప్రకారం గత నెలలో ఇరాన్‌ రోజుకు 1.84 మిలియన్‌ బ్యారల్స్‌ ముడి చమురును ఎగుమతి చేసింది. ఈ నెలలో ఇప్పటి వరకూ రోజుకు 1.71 మిలియన్‌ బ్యారల్స్‌ను సరఫరా చేసింది. గత సంవత్సరంలో రోజుకు సగటున 1.68 మిలియన్‌ బ్యారల్స్‌ ముడి చమురు ఎగుమతి అయింది. ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభం కావడానికి ముందు ఇరాన్‌లో చమురు ఉత్పత్తి ఆకస్మికంగా పెరిగింది. కెప్లర్‌ డేటా ప్రకారం ఈ నెల ప్రారంభం నాటికి 180 మిలియన్‌ బ్యారల్స్‌కు పైగా చమురును నౌకలలో నింపారు. యుద్ధ ప్రారంభానికి ముందు ఇరాన్‌ నుంచి చైనాకు ఎక్కువగా చమురు ఎగుమతులు జరిగాయి. ఇరాన్‌పై విధించిన ఆంక్షలను గత నెలలో అమెరికా ఎత్తివేసిన తర్వాత భారత్‌ సహా పలు దేశాలు అక్కడి నుంచి చమురును దిగుమతి చేసుకోవడం ప్రారంభించాయి. ఇరాన్‌ చమురుతో రెండు నౌకలు సోమవారం భారత్‌ చేరుకున్నాయి. అయినప్పటికీ అమెరికా తీసుకున్న తాజా నిర్ణయంతో ఆసియా దేశాలు చమురు సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశం ఉన్నదని నిపుణులు అభిప్రాయపడ్డారు. యుద్ధానికి ముందు ప్రపంచ చమురు, గ్యాస్‌ ఎగుమతులలో సుమారు 20 శాతం వరకూ హార్ముజ్‌ మీదుగానే జరిగాయి. ఇందులో అత్యధిక వాటా ఆసియాదే. పర్షియన్‌ గల్ఫ్‌, గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్‌ వెంట ఉన్న అన్ని ఇరాన్‌ ఓడరేవుల పైన అమెరికా నిర్ణయం ప్రభావం చూపుతోంది. ఇరాన్‌లోని 11 ప్రధాన ఓడరేవులు, ఎనిమిది దక్షిణ ఓడరేవులలో నౌకల రాకపోకలను అమెరికా పూర్తిగా అడ్డుకుంది. ఖర్గ్‌ దీవి, బందర్‌ అబ్బాస్‌, అసలుయెV్‌ా, ఛాబహార్‌, బుషెహర్‌, బందర్‌ మV్‌ాషహర్‌, బందర్‌ జస్క్‌ ఓడరేవులపై తీవ్ర ప్రభావం పడింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -