Wednesday, April 15, 2026
E-PAPER
Homeజాతీయంకేరళం అసెంబ్లీ ఎన్నికల్లో పెరిగిన పోలింగ్‌ శాతం

కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో పెరిగిన పోలింగ్‌ శాతం

- Advertisement -

79.63 శాతంగా నమోదు: ఈసీ నిర్ధారణ
తిరువనంతపురం:
కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో సర్వీస్‌ ఓట్లను మినహాయించి, పోస్టల్‌ ఓట్లన్నింటినీ కలుపుకుని చూస్తే ఓటింగ్‌ శాతం 79.63 శాతంగా నమోదైందని ప్రధాన ఎన్నికల అధికారి రతన్‌ యు ఖేల్కర్‌ తెలిపారు. మొత్తం 2,71,42,952 మంది ఓటర్లలో, బూత్‌ స్థాయి పోలింగ్‌ ద్వారా 78.27 శాతం ఓట్లు నమోదయ్యాయని ఆయన స్పష్టం చేశారు. వృద్ధులు, వికలాంగులు, అత్యవసర సేవల సిబ్బంది, ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బంది వేసిన 3,68,193 పోస్టల్‌ ఓట్లను ఈ సంఖ్యకు జోడించినప్పుడు పోలింగ్‌ శాతం 79.63 శాతానికి చేరుకుంది.
సర్వీస్‌ ఓట్లతో సహా తుది గణాంకాలను, ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాతే విడుదల చేస్తామని ప్రధాన ఎన్నికల అధికారి పునరుద్ఘాటించారు. పోలింగ్‌ గణాంకాల విడుదలలో జాప్యం జరుగుతోందన్న ఊహాగానాలను ఆయన కొట్టిపారేశారు. పోస్టల్‌ ఓట్ల వివరాలను క్రోడీకరించడానికి మూడ్రోజుల కంటే ఎక్కువ సమయం పట్టలేదని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -