- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
మండల కేంద్రంలోని శ్రీ సేట్ రాంప్రసాద్ ఇనాని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం ఉపాధ్యాయుల దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. టీచర్స్ డే సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులుగా విధులు నిర్వహించారు. కళాశాల ఉపాధ్యాయులకు విద్యార్థిని విద్యార్థులు బహుమానాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల లెక్చరర్లు కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -



