Sunday, September 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శిథిలావస్థకు చేరిన అంబులెన్స్‌

శిథిలావస్థకు చేరిన అంబులెన్స్‌

- Advertisement -

ఏండ్ల తరబడి ఎండా వానకు మగ్గుతున్న వాహనం
నవతెలంగాణ-మద్నూర్

మద్నూర్ మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆవరణంలో ఏండ్ల తరబడి ఎండా వానకు తడుస్తూ శిథిలావస్థకు చేరుకునే దుస్థితికి చేరుకుంది. అత్యవసర సమయాల్లో రోగులకు ఎంతో ఉపయోగపడే ఈ వాహనాన్ని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. రోజుల తరబడి నిలిచిపోవడంతో వాహనం దాదాపుడా తుప్పుపట్టిపోతోంది. మండల పరిధిలోని అన్ని గ్రామాల పేదలకు ఈ వాహనం ఎన్నో సేవలను అందించిందని స్థానికులు చెబుతున్నారు. సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే స్పందించి పేదలకు, అనారోగ్య బాధితుల సౌకర్యార్థం వినియోగంలోకి తీసుకురావాలని, లక్ష‍లు వెచ్చించి కొన్న ప్రజాధనం వృధాకాకుడా చూడాలని కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -