Monday, April 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ గృహప్రవేశాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ మండలాధ్యక్షుడు

ఇందిరమ్మ గృహప్రవేశాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ మండలాధ్యక్షుడు

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని కేమ్రాజ్ కల్లాలి గ్రామంలో ఇందిరమ్మ నూతన గృహ ప్రవేశ కార్యక్రమాన్ని సోమవారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రమేష్ దేశాయ్ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని, ఎమ్మెల్యే ఆదేశాల మేరకు గడప గడపకు వెళ్లి అర్హులైన వారికి ఇళ్లు అందించేలా కృషి చేస్తామని తెలిపారు. మండలంలోని గ్రామాలలో ఇందిరమ్మ గృహలు నిర్మించుకునే ప్రతి ఒక్క లబ్ధిదారులు త్వరితగతిన నిర్మాణాలు చేపట్టి గృహాలను ప్రారంభించుకోవాలని సూచించారు. ఏవైనా సమస్యలు ఉటే నేరుగా మండల స్థాయి అధికారులను కలిసి పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు , కేమ్రాజ్ కల్లాలి సర్పంచ్ , నాగనాథ్ పటేల్ గారు, పురుషోత్తం దేశాయ్ ఉపసర్పంచ్ భూమగొండ, నాడీపీ గంగారాం, వడ్ల గంగారాం, జింగే పండరి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -