నవతెలంగాణ – చండూరు
తెలంగాణ రాష్ట్ర సగర సంఘం పిలుపుమేరకు నల్గొండ జిల్లా సగర సంగం ఆధ్వర్యంలో శ్రీశ్రీశ్రీ భగీరథ జయంతి ఉత్సవాల పోస్టర్ ను మంగళవారం స్థానిక మార్కెట్ యార్డులో తెలంగాణ రాష్ట్ర సగర సంఘం ఉపాధ్యక్షులు కల్లెట్ల మారయ్య సాగర్, జిల్లా సగర సంగం అధ్యక్షుడు నేర్లకంటి రవికుమార్ సాగర్ సంఘం సభ్యులతో కలిసి ఆవిష్కరించి, భగీరథ చిత్రపటాలను కండువాలను అన్ని గ్రామాలకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈనెల 23న జరిగే హైదరాబాద్ రవీంద్ర భారతి ప్రధాన వేదికలో రాష్ట్రస్థాయి జయంతి ఉత్సవాలకు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
జిల్లా ఉపాధ్యక్షులుగా నేర్లకంటి సుధాకర్ సగర, పెండెం వెంకటేష్ సగర, కొలుగూరి రామకృష్ణ సగర, ఆలేటి జగన్ సగర, చింతల నిరంజన్ సగర, గంట శ్రీను సగర, కార్యదర్శులుగా ఉంగరాల సైదులు సగర, గంట వెంకన్న సగర, నేర్లకంటి శంకరయ్య సగర, బలుగురి లక్ష్మయ్య సగర, కల్లెట్ల రాజు సగర,రాసాల వెంకన్న సగర, పెండ్యాల నాగరాజు సగర లను ఏకగ్రీవంగా అనుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బలుగూరి కరుణాకర్ సాగర్, కోశాధికారి కొలుగూరి ప్రవీణ్ సాగర్, కొట్టాల గ్రామ సర్పంచ్ కల్లెట్ల లింగయ్య సాగర్, జోగిగూడెం గ్రామ సర్పంచ్ ఆలేటి యాదయ్య సాగర్, ఆయా గ్రామాల అధ్యక్షులు,ప్రధాన కార్యదర్శులు,కోశాధికారులు పాల్గొన్నారు.



