Monday, June 23, 2025
E-PAPER
Homeఆదిలాబాద్భూ సమస్యల పరిష్కారం కోసమే రెవెన్యూ సదస్సులు..

భూ సమస్యల పరిష్కారం కోసమే రెవెన్యూ సదస్సులు..

- Advertisement -

తహసీల్ధార్ రాజ మనోహర్ రెడ్డి..
నవతెలంగాణ – జన్నారం
: భూ సమస్యల పరిష్కారం కోసమే భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని మండల  తహశీల్దార్ రాజ మనోహర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మంగళవారం జన్నారంలోని రేండ్లగూడ కార్యాలయంలో భూభారతి రెవెన్యూ సదస్సును నిర్వహించారు. భూ సమస్యలపై ప్రజలు, రైతులు ఇచ్చిన అర్జీలను స్వీకరించారు. ఆయా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరిస్తామని తహశీల్దార్ స్పష్టం చేశారు. అలాగే మండలంలోని రాంపూర్ గ్రామంలో భూ రెవెన్యూ సదస్సును గ్రామపంచాయతీ కార్యాలయంలో డిప్యూటీ తాసిల్దార్ రామ్మోహన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామం నుంచి రైతులు ఇచ్చిన దరఖాస్తులను స్వీకరించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఆన్లైన్ మీ సేవ కేంద్రాల్లో ఇచ్చిన దరఖాస్తులు కాకుండా, నేరుగా ఇప్పుడు ఇచ్చిన దరఖాస్తులను మాత్రమే పరిష్కరిస్తామన్నారు. ఈ భూ రెవెన్యూ సదస్సులను రైతులు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏఎంసీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, పిఎసిఎస్ చైర్మన్ అల్లం రవి  ఆర్ ఐ లు బాను చందర్, జాడి గంగరాజా, కార్యదర్శి శ్రీనివాస్ దాముఖ కరుణాకర్ అల్లం వెంకటరాజ్యం బోర్లకుంట ప్రభుదాస్   ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు  అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -