Wednesday, April 22, 2026
E-PAPER
Homeఖమ్మంఏరియా ఆస్పత్రిని సంబంధించిన కాయ కల్ప బృందం 

ఏరియా ఆస్పత్రిని సంబంధించిన కాయ కల్ప బృందం 

- Advertisement -

– పలు విభాగాల్లో తనిఖీలు 
నవతెలంగాణ – అశ్వారావుపేట 

అశ్వారావుపేట ప్రభుత్వ వైద్యశాలను బుధవారం కాయకల్ప ఎక్స్టర్నల్ అసెస్మెంట్ టీం సందర్శించింది. ఈ బృందంలో డాక్టర్ రఘు పూజారి, డాక్టర్ జ్యోత్స్న తో పాటు ఇతర సభ్యులు పాల్గొన్నారు.  ఆసుపత్రిలో పేషెంట్లకు అందుతున్న సేవలను సమగ్రంగా పరిశీలించిన ఈ టీం, వివిధ విభాగాల పనితీరును నిశితంగా అధ్యయనం చేసింది.

రోగులకు అందుతున్న సౌకర్యాలు, వ్యాక్సినేషన్ కార్యక్రమం, ల్యాబ్ సేవలు, నర్సింగ్ సేవలు, మెడికల్ రికార్డులు, డాక్టర్ల పనితీరు తదితర అంశాలను సమీక్షించారు. అలాగే జనరల్ వార్డ్, పీడియాట్రిక్ వార్డ్, డెంటల్ సేవలు, లేబర్ రూమ్, ఆపరేషన్ థియేటర్, పోస్టుమార్టం, డయాలసిస్ సేవలపై పూర్తి వివరాలు పరిశీలించి, రికార్డులను చెక్ చేశారు.రోగులతో నేరుగా మాట్లాడి ఫీడ్ బ్యాక్ కూడా సేకరించారు.

30 పడకల ఆసుపత్రిలో అందుతున్న స్పెషలిస్ట్ సేవలు, డయాలసిస్ మరియు శస్త్రచికిత్స సేవలపై ప్రత్యేక దృష్టి సారించిన టీం, డాక్టర్లు మరియు నర్సింగ్ సిబ్బంది సేవలను అభినందించింది. మొత్తం సేవలపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, ఆసుపత్రి నిర్వహణను ప్రశంసించింది.

భవిష్యత్తులో అశ్వారావుపేట ప్రభుత్వ ఆసుపత్రి కాయకల్ప అవార్డుతో మాత్రమే కాకుండా, ముస్కాన్ మరియు ఎన్‌క్యుఏఎస్ వంటి ప్రతిష్టాత్మక అవార్డులను కూడా సాధించాలని సూచించింది. ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన పర్యావరణరహిత మొక్కలు, శానిటేషన్ నిర్వహణపై కూడా హర్షం వ్యక్తం చేసింది.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డీసీ హెచ్ రవిబాబు, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాధా రుక్మిణి, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ జి. హర్షవర్ధన్, స్పెషలిస్ట్ డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -