Thursday, April 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థుల విద్యాభివృద్ధిలో తల్లిదండ్రుల సహకారం అవసరం 

విద్యార్థుల విద్యాభివృద్ధిలో తల్లిదండ్రుల సహకారం అవసరం 

- Advertisement -

సీనియర్ ఉపాధ్యాయులు భాస్కరా చారి
నవతెలంగాణ – ఆలేరు రూరల్

విద్యార్థుల విద్యాభివృద్ధిలో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల సహకారం కూడా ఎంతో అవసరమని సీనియర్ ఉపాధ్యాయులు భాస్కరా చారి పేర్కొన్నారు. గురువారం ఆలేరు మండలం శారాజిపేట గ్రామంలోని మండల ప్రాథమిక పాఠశాలలో గ్రాడ్యుయేషన్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భాస్కరా చారి మాట్లాడుతూ విద్యార్థుల విద్యాభివృద్ధిలో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల సహకారం కూడా ఎంతో అవసరమని పేర్కొన్నారు.

చిన్నప్పటి నుంచే పిల్లల్లో మంచి అలవాట్లు,క్రమశిక్షణ పెంపొందించాలన్నారు.అనంతరం విద్యార్థులచే బోధన-అభ్యాస సామగ్రి (టీ.ఎల్.ఎం) ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థులు రూపొందించిన వివిధ నమూనాలు, ప్రాజెక్టులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి విద్యార్థుల పురోగతి, పాఠశాల కార్యకలాపాలపై చర్చించారు. పిల్లల చదువుపై తల్లిదండ్రులు మరింత శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులు సూచించారు. ఈ కార్యక్రమంలో హై స్కూల్ హెచ్ఎం జ్యోతిరాజు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణకుమారి,కాంతారావు, పిడి మధు,నరేష్,శ్రీనివాస్ దయాకర్ రామచందర్ కృపాకర్ రాజేశ్వర్ సంగీత నసరుద్దీన్,విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -