కొత్తగా చిత్ర నిర్మాణ రంగంలోకి ప్రవేశించే ప్రతి సంస్థ తమ బ్యానర్ రూప కల్పనలో ప్రత్యేక శ్రద్ధను కనపరుస్తుంది. తమ బ్యానర్కు సంబంధించిన లోగోను, టైటిల్ను చాలా ఆర్టిస్ట్గా రూపొందించుకునేందుకు ప్రయత్నిస్తారు సదరు నిర్మాణ సంస్థ అధినేతలు. అలాగే బ్యానర్ అనౌన్స్మెంట్కు ముందు సెంటిమెంటల్గా దైవ దర్శనం చేసుకుని లోగో ప్రతులను దేవుడి ముందు ఉంచి, భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు.
ఇదే రీతిలో దర్శకులు ఎస్వీ కష్ణారెడ్డి దర్శకత్వంలో కె .అచ్చిరెడ్డి సమర్పణలో నూతన నిర్మాత కొమ్మూరి ప్రతాపరెడ్డి నిర్మిస్తున్న ‘వేదవ్యాస్’ చిత్ర బ్యానర్ ఆవిష్కరణ ఫిలిం నగర్లోని సాయిబాబా దేవాలయంలో శాస్త్రోక్తంగా జరిగింది మాజీ శాసనసభ్యులు, కె . పి. ఆర్. ఐటీ విద్యాసంస్థల అధినేత, బిజినెస్ మ్యాన్ అయిన కొమ్మూరి ప్రతాపరెడ్డి తమ బ్యానర్కు సాయి ప్రగతి ఫిలిమ్స్ అని నామకరణం చేసుకొని, దర్శకులు ఎస్వీ కష్ణారెడ్డి, సమర్పకులు అచ్చిరెడ్డితో కలిసి సంప్రదాయబద్ధంగా పంచ కట్టులో దేవాలయానికి విచ్చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించి, బ్యానర్ను ఆవిష్కరించారు. తమ
హైందవ ధర్మ విశిష్టతను ఆవిష్కరిస్తూ సైంటిఫిక్ అప్రోచ్ కలిగిన సకుటుంబ సమేత కథాంశంతో ఎస్వీ కష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న వేదవ్యాస్ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి.
పిడుగు విశ్వనాథ్ హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రం ద్వారా కొరియన్ నటి జూన్ హ్యూంజీ, మంగోలియన్ నటుడు షరన్ బోల్డ్ సెగ్మెంట్ను తెలుగు తెరకు పరిచయం చేయటం విశేషం. సాయికుమార్, సుమన్, బాబు మోహన్, శివాజీ రాజా, అలీ, ఉత్తేజ్ తదితరులు ఇతర ముఖ్యతారాగణం.
సరికొత్త కథా కథనాలతో ‘వేదవ్యాస్’
- Advertisement -
- Advertisement -



