రోడ్లు, భవనాల శాఖకు నిధులు కేటాయిస్తాం

Funds will be allocated to the roads and buildings department– భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా
– ఆర్‌ఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌
– నంది ఆవార్డులపై క్యాబినెట్‌లో చర్చిస్తాం
– ఎఫ్‌డీసీ భూములను సంరక్షిస్తాం : ఆర్‌అండ్‌బీ, సినిమాటోగ్రఫీ శాఖల సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రోడ్లు, భవనాల నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రోడ్లు భవనాల శాఖామాత్యులు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అన్నారు. శనివారం సచివాలయంలో 2024-25 వార్షిక బడ్జెట్‌ సన్నాహక సమావేశంలో వివిధ రోడ్లు, భవనాలు, రైల్వే బ్రిడ్జీలు, సినిమా పరిశ్రమకు సంబంధించిన బడ్జెట్‌ కేటాయింపుల ప్రతిపాదనలపై ఆ శాఖల ఉన్నత అధికారులతో చర్చించారు. గత ప్రభుత్వం కేటాయింపులు పత్రికల్లో చూపించి, చెల్లింపులు చేయని కారణంగా చిన్న కాంట్రాక్టర్లు ఇబ్బందులు పడుతున్నారనినీ, పదిసార్లు టెండర్లు పిలిచినా పనులు చేయడానికి ముందుకు రాని పరిస్థితి ఉందని మంత్రి కోమటిరెడ్డి ఆర్ధికమంత్రి దష్టికి తీసుకువచ్చారు. అనంతరం రాష్ట్రంలో పెండింగ్‌ లో ఉన్న రోడ్డు నిర్మాణాల గురించి మంత్రులు అడిగిన ప్రశ్నలకు అధికారులు పీపీటీ రూపంలో వివరించారు. ప్రధానంగా రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌)కు సంబంధించి ఆలైన్‌మెంట్‌పై చర్చించారు. డిప్యూటి సీఎం మాట్లాడుతూ భవిష్యత్తు తరాల అవసరాలను దష్టిలో పెట్టుకొని పారదర్శకంగా ప్రజలకు జవాబుదారీగా ఆలైన్‌మెంట్‌ ఉండాల్సిన అవసరం ఉందని అధికారులకు సూచించారు. ఇష్టం వచ్చినట్టుగా కాకుండా క్రమపద్ధతిలో ఆలైన్‌మెంట్‌ ఉండాలని ఆదేశించారు. రీజినల్‌ రింగ్‌ రోడ్డు భూసేకరణకు బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని డిప్యూటీ సీఎంను కోరారు. నల్లగొండ, హైదరాబాద్‌లో కలెక్టరేట్ల నిర్మాణంతోపాటు ఆర్వోబీలు, ఆర్‌యూబీలు, వీయూబీ బ్రిడ్జీల నిర్మాణానికి రాష్ట్రం వాటా నిధులు ఇస్తామన్నారు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో రోడ్‌ నెట్‌వర్క్‌ పెంచేందుకు అవసరమున్న నిధులు విడుదల చేయాలని చేసిన ప్రతిపాదనలను డిప్యూటీ సీఎం పరిశీలించారు. రాష్ట్రంలో సీఐఆర్‌ఆఫ్‌ నిధులతో చేపట్టే నిర్మాణాలకు భూసేకరణ నిధులకు ఇబ్బందులు రాకుండా బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులు చేయాలని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన విజ్ఞప్తికి ఆర్ధిక మంత్రి అంగీకారం తెలిపారు. అనంతరం సినిమాటోగ్రఫీ అంశంపై జరిగిన చర్చలో సినిమా పరిశ్రమ అభివద్ధి కోసం కేటాయించిన భూములను కాపాడాలని ఉపముఖ్యమంత్రి సినిమాటోగ్రఫీ అధికారులను ఆదేశించారు. చలన చిత్ర పరిశ్రమలో నటీనటులకు అందజేసే నంది ఆవార్డులపై క్యాబినెట్‌లో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. చిన్న నిర్మాతలకు సినిమాలు విడుదల చేయడంలో ఎదురవుతున్న ప్రతిబంధకాలను తొలగించాలన్నారు. ఫిలిం డెవలప్‌మెంట్‌ పరిధిలో హైదరాబాద్‌ ఫిలింనగర్‌లో ఉన్న భూములు ఆన్యాక్రాంతం కాకుండా సంరక్షణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సినిమా టికెట్ల కంటే థియేటర్‌లో అమ్మే చిరుతిళ్లకు వందరేట్లుఎక్కువ వసూళ్లకు పాల్పడుతున్నారని సినిమాటోగ్రఫీ అధికారుల దష్టికి తీసుకొచ్చారు. అన్ని మెట్రో నగరాల్లో అమలవుతున్న రేట్లకంటే హైదరాబాద్‌ సినిమా హాల్లలో అమ్ముతున్న రేట్లు వందల శాతం ఎక్కువగా ఉన్నాయనీ, దీనిపై తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇక ఆన్‌ లైన్‌ టికెటింగ్‌ కోసం వేసిన కమిటీ నివేదిక వచ్చాక నిర్ణయం తీసుకుందామని ఆయన తెలిపారు. చిత్రపురికాలనీలో ప్లాట్ల కేటాయింపులో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలున్నాయనీ, వాటిపై తగిన సమయంలో నిర్ణయం తీసుకుందామని కోమటిరెడ్డి అధికారులకు చెప్పారు. ఈ సమావేశంలో ఆర్ధిక శాఖ స్పెషల్‌ ఛీఫ్‌ సెక్రెటరీ రామకష్ణారావు, రోడ్లు, భవనాల శాఖా ముఖ్యకార్యదర్శి శ్రీనివాసరాజు, ఆర్థికశాఖ సంయుక్త కార్యదర్శి హరిత, డిప్యూటి సీఎం కార్యదర్శి కష్ణభాస్కర్‌, ఈఎన్సీలు రవీందర్‌రావు, గణపతిరెడ్డి, సతీష్‌తో పాటు ఐఅండ్‌ పీఆర్‌ కమీషనర్‌ అశోక్‌రెడి పాల్గొన్నారు.

Spread the love