Sunday, June 8, 2025
E-PAPER
Homeతాజా వార్తలు'మిడ్‌డేమీల్స్‌' ను అక్షయపాత్రకు ఇవ్వొద్దు

‘మిడ్‌డేమీల్స్‌’ ను అక్షయపాత్రకు ఇవ్వొద్దు

- Advertisement -

– రంగారెడ్డి జిల్లాలో ఐదు మండలాలకు ఇవ్వడాన్ని వెనక్కి తీసుకోవాలి
– పెండింగ్‌ బిల్లులు, గౌరవ వేతనాలు ఇవ్వాలి : ఎస్వీ.రమ, వై.స్వప్న
– పాఠశాల విద్యాశాఖ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికుల ధర్నా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజనం పథకం నిర్వహణను అక్షయపాత్రకు ఇవ్వొద్దనీ, రంగారెడ్డి జిల్లాలో ఐదు మండలాల బాధ్యతను ఇవ్వడాన్ని వెనక్కి తీసుకోవాలని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్‌(సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై.స్వప్న, ఎస్వీ.రమ డిమాండ్‌ చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని విద్యాశాఖ కార్యాలయం ఎదుట ఆ యూనియన్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అందులో వారితో పాటు సీఐటీయూ రంగారెడ్డి జిల్లా కోశాధికారి కవిత, ఉపాధ్యక్షులు రుద్రకుమార్‌, నర్సిరెడ్డి, తిరుమలేష్‌, అలివేలు, గణేష్‌, మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అడిషనల్‌ డైరెక్టర్‌, మిడ్‌డే మీల్స్‌ ఇన్‌చార్జి ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన ఆయన ఇప్పటివరకూ అక్షయపాత్రకు ఇచ్చే ప్రతిపాదనలేమీ లేవనీ, పెండింగ్‌ బిల్లులు ఈరోజే విడుదల చేస్తామని, వేతన పెంపుదల రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీనిచ్చారు. అంతకుముందు ధర్నానుద్దేశించి రమ, స్వప్న మాట్లాడుతూ..రంగారెడ్డి జిల్లాలో 2,400 మంది మధ్యాహ్న భోజన కార్మికులు 23 ఏండ్లుగా అనేక కష్టనష్టాలకోర్చి పిల్లలకు వంట చేసి పెడుతున్నారనీ, వారిలో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన మహిళలే ఉన్నారని తెలిపారు. వారి ఉపాధిని పరిగణలోకి తీసుకోకుండా షాద్‌నగర్‌, శంషాబాద్‌, హయత్‌నగర్‌, అబ్దుల్లాపూర్‌మెట్టు, మహేశ్వరం మండలాల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయపాత్రకి ఇవ్వాలని నిర్ణయించడాన్ని తప్పుబట్టారు. అక్షయపాత్ర స్వచ్ఛంద సంస్థ ద్వారా ఒకే దగ్గర వండి సప్లరు చేయడం ద్వారా నాణ్యత ఉండదనీ, పిల్లలకు చేరేసరికి పాచిపోయే ప్రమాదం ఉంటుందని తెలిపారు. వారు గుడ్లు పెట్టరనీ, పిల్లలకు పౌష్టికాహారం అందదని చెప్పారు. కాబట్టి మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షరు పాత్రకు ఇచ్చే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. పెరిగిన ధరలకనుగుణంగా పిల్లలకిచ్చే మెనూ చార్జీలు పెంచడం లేదని వాపోయారు. తొమ్మిది, పదో తరగతుల పిల్లలకు సంబంధించి 8 నెలల కోడిగుడ్ల బిల్లులు, 6 నెలల కార్మికుల జీతాలు పెండింగ్‌లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గౌరవ వేతనం కూడా ఇవ్వకుండా ఎలా పనిచేస్తారని ప్రశ్నించారు. పెండింగ్‌ బిల్లులు, జీతాలను వెంటనే విడుదల చేసి కార్మికుల వ్యక్తిగత ఖాతాల్లోనే వేయాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -