నవతెలంగాణ – హైదరాబాద్: రాజస్థాన్ లోని ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీలోని ఐసీయూ వార్డులో చికిత్స పొందుతున్న 32 ఏళ్ల మహిళపై నర్సింగ్ సిబ్బంది లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన తాజాగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు నమోదు చేసి ఎఫ్ఐఆర్ వివరాల ప్రకారం.. 32 ఏళ్ల మహిళ ఐసీయూ వార్డులో చికిత్స పొందుతోంది. ఆమె కుటుంబ సభ్యులు వార్డు బయట వేచి ఉన్నారు. ఆ సమయంలో అక్కడి నర్సింగ్ స్టాఫ్ ఒకరు మహిళపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆమె పడుకున్న మంచం చుట్టూ కర్టెన్స్ వేసి.. ఆమెకు మత్తు మందు ఇచ్చాడు. అనంతరం ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితురాలు స్పృహలోకి వచ్చాక ఈ దారుణాన్ని కుటుంబ సభ్యులకు వివరించింది. దీంతో వారు ఆస్పత్రి సిబ్బందిని ప్రశ్నించగా.. ఆ ఆరోపణలు వారు ఖండించారు. దీంతో బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు సబ్ ఇన్స్పెక్టర్ తెలిపారు.
ఐసీయూలో మహిళపై లైంగికదాడి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES