– కామారెడ్డి జిల్లా రాజంపేట్ మండలంలో ఘటన
నవతెలంగాణ-రాజంపేట్
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా రాజంపేట్ మండలంలోని ఆరుగొండ గ్రామంలో జరిగింది. ఎస్ఐ పుష్పరాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జంగిటి పెంటయ్య(48)కు గ్రామ శివారులోని గెరికబాయి కుంట సమీపంలో 20 గుంటల వ్యవసాయ భూమి ఉంది. జొన్న పంట సాగుచేస్తే దిగుబడి సరిగా రాకపోవడంతో తీవ్ర ఆర్థిక, మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. అలాగే పెంటయ్యకు ఇద్దరు కుమార్తెలు ఉండగా.. వారి పెండ్లిళ్ల సమయంలోనూ అప్పు అయింది. అప్పుల బాధ భరించలేక తీవ్ర మనస్తాపానికి గురై శనివారం ఉదయం పంట పొలానికి వెళ్తున్నా అని చెప్పి ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాలేదు. తన పొలంలోనే చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక రైతులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. రైతు భార్య జంగిటి రాజమణి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రైతు ఆత్మహత్య
- Advertisement -
- Advertisement -