Sunday, June 8, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంరష్యా ప్రతిదాడి

రష్యా ప్రతిదాడి

- Advertisement -

– ఖార్కీవ్‌పై డ్రోన్లు, మిసైల్స్‌తో అటాక్‌
– గతవారం రష్యాపై ఉక్రెయిన్‌ డ్రోన్‌ ఆపరేషన్‌
కీవ్‌:
రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చల్లారటం లేదు. తమపై ఉక్రెయిన్‌ దిగుతున్న దాడులకు.. రష్యా తీవ్రంగా స్పందిస్తోంది. తాజాగా.. ఉక్రెయిన్‌లో రెండో అతిపెద్ద నగరమైన ఖార్కీవ్‌పై డ్రోన్లు, మిస్సైళ్లను ప్రయోగించింది. గతవారం రష్యాపై ఉక్రెయిన్‌ డ్రోన్‌ ఆపరేషన్‌తో దాడికి దిగిన విషయం తెలిసిందే. దీంతో ఉక్రెయిన్‌ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఆ సమయంలో అన్నారు. తాజాగా, ఖార్కీవ్‌పై ఈ దాడి చోటు చేసుకోవటం గమనార్హం. ఉక్రెయిన్‌ ఉగ్రవాద చర్యలకు ప్రతిస్పందనే ఈ దాడి అని మాస్కో వర్గాలు చెప్పాయి. ఖార్కివ్‌పై రష్యా శుక్రవారం రాత్రి పెద్ద ఎత్తున డ్రోన్లు, మిసైల్స్‌, గైడెడ్‌ బాంబులను ప్రయోగించింది. సుమారు 50 డ్రోన్లతో దాడి చేసింది. ఆ దాడిలో ముగ్గురు మృతిచెందారు. మరో 17 మంది గాయపడ్డారు. డ్రోన్లతో పాటు రెండు మిసైల్స్‌, నాలుగు గ్లైడింగ్‌ బాంబులను కూడా ఖార్కీవ్‌ నగరంపై రష్యా ఫైర్‌ చేసినట్టు ఉక్రెయిన్‌ వివరించింది. కేవలం 90 నిమిషాల వ్యవధిలో ఆ అటాక్‌ ముగిసినట్టు ఖార్కీవ్‌ మేయర్‌ తెలిపారు. పశ్చిమ దేశాల నేతలు ఉదాసీనంగా ఉండడం కారణంగానే దాడులు కొనసాగుతున్నట్టు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఇటీవల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌పై కూడా ఆయన తన అసంతృప్తిని వెళ్లగక్కారు. ఖార్కీవ్‌పై తాజాగా జరిగిన దాడులపై రష్యా ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. దేశవ్యాప్తంగానూ దాడులు జరిగినట్టు ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహ తెలిపారు. డోనస్కీ, డినిప్రో, టెర్నోపిల్‌, ఒడిసా ప్రాంతాల్లో అటాక్‌లు జరిగాయన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -