- Advertisement -
![]() |
చర్యలు తీసుకోవాలంటున్న గ్రామ పెద్దలు
నవతెలంగాణ – నవాబు పేట: మండల పరిధిలోని మల్లారెడ్డి పల్లి సమీపంలో ఉన్న కుంటలో కొందరు ఇసుక మాఫియా దారులు ఇసుకమట్టి తరలింపుకు పాల్పడుతున్నారు అని గ్రామ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే గ్రామానికి చెందిన వ్యక్తులు తమ జేసీబీలతో టిప్పర్ లలో నింపి ఫిల్టర్ చేసేందుకు నిల్వ ఉంచారని, అక్రమంగా డబ్బులు సంపాదించాలని ఈ విధంగా చెరువులలో కుంటలలో వాగులలో ఉండే మట్టిని తరలిస్తున్నారు. కుంటలో ఉన్న ఇసుక మట్టిని తరలిస్తే నీటి నిల్వ ఉండదు అని కుంటకట్టకు ప్రమాదం ఉంటుంది అని సంబంధించిన రెవెన్యూ మైనింగ్ పోలీసులు మట్టిని తరలించేవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
- Advertisement -