
నవతెలంగాణ – బెజ్జంకి
రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టులాంటిదని బీఆర్ఎస్ మండల యువజన నాయకుడు బండిపెల్లి సతీశ్ సోమవారం ఆరోపించారు. ప్రజలకు, ప్రభుత్వాలకు వారధులుగా నిలిచే జర్నలిస్టులపై దాడులు చేసిన వారిని ప్రభుత్వం గుర్తించి, చట్టపరమైన చర్యలు చేపట్టాలని సతీశ్ డిమాండ్ చేశారు.