నవతెలంగాణ – కమ్మర్ పల్లి : తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ బడిలోనే చేర్పించాలని మండల కేంద్రంలోని మండల పరిషత్ బాలికల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ అన్నారు. ఆదివారం స్థానిక గొల్లపేట ఇందిరమ్మ కాలనీలో ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల కోసం ప్రభుత్వం అనేక సౌకర్యాలను కల్పిస్తుందని, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వం కల్పించే సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని తమ పిల్లల్ని ప్రభుత్వ బడుల్లోనే చేర్పించాలని కోరారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం విద్యార్థుల కోసం అందిస్తున్న సౌకర్యాలతో ముద్రించిన కరపత్రాలను విద్యార్థుల తల్లిదండ్రులకు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు బడి ఈడు పిల్లల్ని గుర్తించి పేర్లను నమోదు చేసుకున్నారు. కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు రవీందర్, తదితరులు పాల్గొన్నారు.
పిల్లల్ని ప్రభుత్వ బడిలోనే చేర్పించాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES