Tuesday, August 12, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్రెవెన్యూ సదస్సులలో దరఖాస్తులు పెట్టుకోండి..

రెవెన్యూ సదస్సులలో దరఖాస్తులు పెట్టుకోండి..

- Advertisement -

జుక్కల్ డిప్యూటీ తహసిల్దార్ హేమలత, ఆర్ఐ రామ్ పటేల్..
నవతెలంగాణ – జుక్కల్ 
: సత్వర భూ సమస్యల కొరకు రెవెన్యూ సదస్సులు దరఖాస్తులు పెట్టుకోవాలని జుక్కల్ డిప్యూటీ తాసిల్దార్ హేమలత , ఆర్ఐ రామ్ పటేల్ తెలిపారు. మండలంలోని డోన్గావ్, మాదాపూర్ గ్రామాలలో రెండు బృందాలుగా ఏర్పడి సోమవారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డోన్గావ్, మాదాపూర్ గ్రామాలలో గ్రామ ప్రజలు భూ సమస్యలు ఉన్నవారు రెవెన్యూ సదస్సులో పాల్గొని తమ సమస్యలను రాతపూర్వకంగా అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. మండలంలో అత్యధికంగా భూవివాదాలు గెట్ పంచాయతీలు అధికంగా ఉండడంతో అధికారులు సమస్యలను పరిష్కరించేందుకు సామరస్యంగా ఉండాలని, ఎటువంటి వివాదాలకు తావివ్వకుండా అధికారులను సంప్రదించి సమస్యలను ఉమ్మడిగా కూర్చొని పరిష్కరించుకోవడం ఉత్తమమని సమస్యలున్నవారికి సూచించారు. ఈ కార్యక్రమంలో రివెన్యు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img