Friday, June 13, 2025
E-PAPER
Homeఖమ్మంవరి విత్తనాలను వెదజల్లే పద్ధతిని పర్యవేక్షించిన ఏఓ రవికుమార్

వరి విత్తనాలను వెదజల్లే పద్ధతిని పర్యవేక్షించిన ఏఓ రవికుమార్

- Advertisement -

వరిసాగు – నాటే పద్దతులు, ప్రయోజనాలు
– వ్యవసాయ శాఖ ఏడీఏ రవి కుమార్
నవతెలంగాణ – అశ్వారావుపేట
: సాగు సమయం ఆసన్నం అయింది. రైతులు వేసవి దుక్కులు పూర్తి చేసి వానాకాలం పంటలు సాగుకు సన్నద్దం అవుతున్నారు. తెలంగాణ లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజక వర్గంలో వానాకాలం పంటలు లో వరి సాగు ప్రధానమైనది. దీంతో రైతులు వరి నారు పెంచడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వరి సాగులో మొక్క నాటడం రెండు రకాలు ఉంటుంది. ఆదిలో లో నేరుగా వెదజల్లే పద్దతి ఉండగా తెలివి మీరిన రైతు నారు పోసి, పెంచి దాన్ని నాటే పద్ధతిని అలవర్చుకున్నాడు. అయితే ఇది సమయాభావం,వ్యయం ఉన్నందున ఆది కాలంలో నాటి రైతులు నేరుగా వెదజల్లే పద్దతిలో ఇవి రేండు ఆదా అయ్యే అవకాశం ఉంది. నేరుగా వెదజల్లే పద్దతి పై వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు రవి రైతులకు ఒనగూరే ప్రయోజనాలను వివరించారు.

ఆయన కధనం ప్రకారం.. నేరుగా వెదజల్లే పద్దతి లో వరి సాగు ప్రయోజనాలు :

1.నారు మడి యాజమాన్యం, నెల రోజుల సమయం ఆదా అవుతుంది.
2.నాట్లు వేసే పద్దతిలో ఎకరాకు 25 కిలో గ్రాముల విత్తనం సరిపోతుంది.అదే నేరుగా వెద జల్లేందుకు 10 కిలోలు అవసరం అవుతాయి
3.నాట్లు వేసే పద్దతిలో నాటు వేసే కూలీలకు ఎకరాకు రూ.5 వేల ఖర్చు.ఈ మొత్తం నేరుగా వెదజల్లే పద్దతిలో ఆదా అవుతుంది.
4.నాట్లు వేసేందుకు దమ్ము కొరకు రూ.3 వేల వరకు ఖర్చు కాగా, వెదజల్లే పద్దతిలో ఈ ఖర్చు మిగులుతుంది.
5.వెదజల్లే పద్దతిలో షుమారు రూ. 8 వేల వరకు ఆదా అవుతాయి.
6. అశ్వారావుపేట వ్యవసాయ డివిజన్ లో 40 వేల ఎకరాలకు పైగా వరి సాగులో వుంది.
7. రైతుకు తనకున్న వరి సాగు విస్తీర్ణంలో కొంత భూమి అయినా నేరుగా వెదజల్లే పద్దతి ఆచరిస్తే రైతుకు సాగుపై ఖర్చు తగ్గుతుంది.
8.అన్నపురెడ్డిపల్లి మండలం అన్నదైవం గ్రామంలో వరిని నేరుగా వెదజల్లి సాగు చేస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
9. కాటిని మార్కండేశ్వర రావు, మందపాటి శ్రీనివాస రెడ్డి అలాంటి కోవకు చెందినవారు. వీరు గత కొన్ని సంవత్సరాలుగా వరిని ఈ పద్దతిలో సాగు చేస్తూ నాట్లు వేసి వరి సాగు పద్దతి తో పోలిస్తే ఖర్చు తగ్గించుకొని లాభం పొందుతున్నారు.
10. విత్తనాలను చల్లిన తరువాత ట్రాక్టర్ రోటావేటర్ వేయటం వలన చల్లిన విత్తనం పై మట్టి కప్పి వేస్తుంది.
11. వర్షం ద్వారా లేదా సాగు నీరు ఇచ్చినప్పుడు తేమ ద్వారా విత్తనాలు మొలకెత్తుతాయి.
12. మంగళవారం పది ఎకరాల్లో వరి నేరుగా వెద జల్లారు.
13.నానాటికి పంటల సాగులో ఖర్చులు పెరుగుతున్న నేపధ్యంలో రైతుకు నికరాదాయం తగ్గుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని వరి సాగులో అనాదిగా వున్న “కరేత”కు ప్రాధాన్యత వచ్చింది. దీన్నే నేరుగా వెదజల్లే పద్దతిలో వరి సాగు అంటారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -