Saturday, June 14, 2025
E-PAPER
Homeఖమ్మంముగిసిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు..

ముగిసిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు..

- Advertisement -

నవతెలంగాణ – అశ్వరావుపేట : ప్రొఫెసర్ జయ శంకర్ తెలంగాణ విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల పర్యవేక్షణలో నిర్వహిస్తున్న రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం అశ్వారావుపేట మండలంలో ముగిసింది. మంగళవారం మండలంలోని కావడిగుండ్ల,ఖమ్మంపాడు రెవిన్యూ గ్రామాల లో నిర్వహించారు. కావడి గుండ్లలో నిర్వహించిన కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ శిరీష,డాక్టర్ జంబమ్మ లు పాల్గొన్నారు. రైతులను ఉద్దేశిస్తూ డాక్టర్ జంబమ్మ మాట్లాడుతూ సూచించిన పంటలలో సూక్ష్మ నీటి పారుదల,బిందు సేద్యం పాటించి రైతు సోదరులు పంట సాగులో నీటి ఆదా ను పాటించాలని  తెలియజేశారు. రైతు సోదరులు వానాకాలంలో సాగు చేసే పంటలలో సుస్థిర వ్యవసాయం చేయవచ్చని తెలిపారు.భూసార పరీక్ష అను సారంగా ఎరువు యాజమాన్యం చేపట్టాలని తెలియజేశారు. అనంతరం డాక్టర్ శిరీష మాట్లాడుతూ సిఫారసు చేసిన మేరకు యూరియా ని వాడటం వల్ల ఖర్చు తగ్గించడమే కాకుండా నేలలోని సూక్ష్మజీవులను రక్షించు కోవచ్చని,తద్వారా వాతావరణంలో ని నత్రజని స్థిరీకరించే అవకాశం ఉందని తెలిపారు.రైతు సోదరులు పచ్చిరొట్ట పైర్లు ను సాగు చేసి పంటల్లో కలియ దున్ని సేంద్రీయ కర్బనం శాతం పెంచాలని తెలిపారు. వ్యవసాయ అధికారి శివరాం ప్రసాద్ మాట్లాడుతూ రైతులు వానాకాలం పంట సాగుకు అవసరమయ్యే విత్తనాలు కొనుగోలు చేసినప్పుడు రసీదులు భద్రపరచుకోవాలని తెలియజేశారు.వ్యవసాయ శాఖ నుండి రాయితీల గురించి వివరించారు. ఉద్యాన విస్తరణ అధికారి ఈశ్వర్ మాట్లాడుతూ ఉద్యాన శాఖ నుండి లభ్యమయ్యే రాయితీల గురించి వివరించారు. ముఖ్యంగా బిందు సేద్యం, పండ్ల సాగుకు సంబంధించిన రాయితీల గురించి చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా మాజీ సర్పంచ్ శ్రీమతి భూ లక్ష్మి  రైతులందరూ శాస్త్రవేత్తలు చెప్పినటువంటి ముఖ్యమైన సూచనలను పాటించి రాబోయే వాన కాలంలో పంట సవ్యంగా చేసుకోవాలని కోరారు. గ్రామపంచాయతీ సెక్రటరీ మోతిలాల్  ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.

ఖమ్మంపాడులో… ఖమ్మంపాడు లో జరిగిన కార్యక్రమంలో డాక్టర్ కే.నాగాంజలి,డాక్టర్ పి.ఝాన్సీ రాణి లు పాల్గొన్నారు. నాగాంజలి మాట్లాడుతూ పంటల సేద్యంలో రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించాలని,తద్వారా భూసారం పెరుగుతుందని వివరించారు.అధిక రసాయనిక ఎరువుల వాడకం ద్వారా భూసారం తగ్గిపోతుందని హెచ్చరించారు.ప్రతి ఏడాది పంట మార్పిడి చేయడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని అన్నారు . అలాగే పచ్చిరొట్ట ఎరువుల ప్రాముఖ్యత,చెట్లను పెంచడం, పర్యావరణం కాపాడటం,  నీటిని ఆదా చేసే పద్ధతులు   గురించి రైతులకు వివరించారు.డాక్టర్ పి.ఝాన్సీ రాణి మాట్లాడుతూ నేల సారాన్ని పెంచడంలో  అపరాల ప్రాముఖ్యత వివరించారు. అపరాల సాగు, రకాలు మరియు పురుగుల తెగుళ్ళ నివారణ గురించి వివరించారు. గ్రామంలో పంటల వైవిద్యం చూపించినందుకు రైతులను అభినందించారు.అలాగే ఇంకుడు గుంతలు,ఫామ్ పాండ్ ప్రాముఖ్యత తెలియజేశారు.వ్యవసాయ విస్తరణ  అధికారి షకీరా భాను ఫార్మర్ రిజిస్ట్రేషన్ పద్ధతి గురించి మరియు వివిధ రకాలైన డిపార్ట్మెంట్ స్కీమ్స్ గురించి వివరించారు,సబ్సిడీ ద్వారా మినుము విత్తనం సరఫరా చేయబడుతుంది అని తెలిపారు.మునగా,వెదురు, టేకు సేద్యం వైపు రైతులు దృష్టి సారించాలని ఆమె సూచించారు.తద్వారా అదనపు ఆదాయం పొందవచ్చని అన్నారు. వ్యవసాయ విస్తరణ అధికారి ఏ.సతీష్ గవర్నమెంట్ స్కీమ్స్ అయినటువంటి బోర్ బావులు తవ్వకాలు గురించి తెలిపారు.ఈ కార్యక్రమంలో  భారీ ఎత్తులో ఖమ్మంపాడు మరియు కోయ రంగాపురం రైతులు, అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల విద్యార్థులు అశోక్,అలేఖ్య, శేఖర్,శివ,అమూల్య,పూజిత రాహుల్, అనిల్ , పంచాయితీ సెక్రటరీ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -