Tuesday, September 15, 2026
E-PAPER
Homeఖమ్మంకొనసాగుతున్న రెవెన్యూ సదస్సులు

కొనసాగుతున్న రెవెన్యూ సదస్సులు

- Advertisement -

నవతెలంగాణ –  అశ్వారావుపేట : ఈ నెల 3 వ తేది ప్రారంభం అయిన రెవెన్యూ సదస్సులు కొనసాగుతూనే ఉన్నాయి. 10 వ తేదీ మంగళవారం దురద పాడు,నారాయణపురం రెవిన్యూ గ్రామంలోని దిబ్బ గూడెం,మొద్దులు మడ,మల్లాయిగూడెం పంచాయితీల్లో గల గాడ్రాల,దిబ్బ గూడెం,పండువారిగూడెం, కొండతోగు ఆవాస గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ రామక్రిష్ణ మాట్లాడుతూ ఇప్పటి వరకు 10 రెవెన్యూ గ్రామాల్లో 13 పంచాయితీల్లో ని 27 ఆవాస గ్రామాల్లో  రెవిన్యూ సదస్సులు నిర్వహించామని తెలిపారు. ఇందులో డీటీ హుస్సేన్, ఆర్ఐ లు పద్మావతి, క్రిష్ణ, ఎస్.ఏ లు లక్ష్మయ్య, చైతన్య, ఆర్.ఏ లు ఎం.రమేష్, శ్రీశైలం, టైపిస్ట్ టి.పీ వెంకన్న, చైన్ మెన్ సన్యాసి లు, కార్యదర్శులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -