Sunday, June 29, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఅహ్మదాబాద్‌ ప్రమాదంపై బ్రిటన్‌ ప్రధాన మంత్రి దిగ్భ్రాంతి

అహ్మదాబాద్‌ ప్రమాదంపై బ్రిటన్‌ ప్రధాన మంత్రి దిగ్భ్రాంతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం పై బ్రిటన్‌ ప్రధాన మంత్రి కీర్‌ స్టార్మర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా ఆయన పోస్టు పెట్టారు. ‘బ్రిటీష్‌ జాతీయులతో లండన్‌ వెళ్తున్ ఎయిర్‌ ఇండియా విమానం భారతదేశంలోని అహ్మదాబాద్‌ నగరంలో కూలిపోయింది. ఆ దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. పరిస్థితిపై భారత్‌ను సంప్రదించి వివరాలు తెలుసుకుంటున్నాం. ప్రమాదంలో చిక్కుకున్న వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’ అని తన ఎక్స్‌ పోస్ట్‌లో కీర్‌ స్టార్మర్‌ పేర్కొన్నారు.

ఎయిర్‌ ఇండియా విమానం గురువారం మ‌ధ్యాహ్నం 1.39 గంట‌ల‌కు ఇద్దరు పైల‌ట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బందితో పాటు 242 మంది ప్రయాణికుల‌తో లండ‌న్ బ‌య‌ల్దేరింది. మొత్తం 242 మందిలో 169 మంది భారతీయులుగా అధికారులు తెలిపారు. మరో 53 మంది బ్రిటన్‌ దేశస్థులు, ఏడుగురు పోర్చుగల్‌ పౌరులు, ఒకరు కెనడా జాతీయుడు ఉన్నారు. విమానం టేకాఫ్‌ అయిన నిమిషాల వ్యవధిలోనే ఎయిర్‌పోర్టుకు స‌మీపంలోని సివిల్ ఆస్పత్రి వ‌ద్ద బీజే మెడిక‌ల్ కాలేజీ హాస్టల్ (medical college hostel) భ‌వ‌నంపై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 133 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మరోవైపు ప్రమాదంలో హాస్టల్‌ భవనాలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. అందులోని 20 మంది మెడికోలు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -