- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారం కోసం భూభారతి రెవెన్యూ సదస్సులో వచ్చే దరఖాస్తులను పరిశీలించి భూ సమస్యలను పరిశీలించడం జరుగుతుందని మండల తాసిల్దార్ ఎండి ముజీబ్ తెలిపారు. భూభారతి రెవెన్యూ సదస్సులో భాగంగా శుక్రవారం నాడు పెద్ద తడగూర్ రైతు వేదికలు భూభారతి రెవెన్యూ సదస్సును నిర్వహించారు. భూ సమస్యల కోసం రైతుల నుండి దరఖాస్తులను స్వీకరించడం జరిగిందని భూ సమస్యల పరిష్కారం కోసం వచ్చిన రైతులకు ఆ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈరన్న కృషి అభినందనీయమని తాసిల్దార్ పేర్కొన్నారు. ఈ సదస్సులో రెవెన్యూ అధికారులు, సిబ్బంది, ఆ గ్రామ ఏ ఈ ఓ అనిల్, వ్యవసాయదారులు పాల్గొన్నారు.
- Advertisement -