నవతెలంగాణ – కామారెడ్డి : కాంగ్రెస్ సీడబ్ల్యూసీ మెంబర్ ట్రైనింగ్ ఇంచార్జ్ సచిన్ రాయ్ తో జుమ్ మీటింగ్ లో కామారెడ్డి ఏఎంసి డైరెక్టర్ నునావత్ గణేష్ నాయక్ పాల్గొన్నారు. శనివారం ఉదయం 11 -30 లకు ఇంటర్వ్యూలో పాల్గొన్నట్లు గణేష్ నాయక్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ స్కీములు పాలన తీరు కార్యక్రమాల గురించి, రాహుల్ గాంధీ పాదయాత్ర గురించి, దేశంలో జరుగుతున్న పాలన గురించి, జరగబోయే పాలన గురించి జల్ జంగల్ జమిన్ నీళ్ళు నిధులు నియామకాలు గురించి, 1/70 యాక్టు, పిసా చట్టం ఆదివాసి గిరిజన సంక్షేమ పైన వివరంగా ఇంటర్వ్యూ లో చర్చలు కొనసాగిందనీ గణేష్ నాయక్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ సిడబ్ల్యుసి మెంబర్ ట్రైనింగ్ ఇంచార్జ్ సచిన్ రాయ్ , తమిళనాడు మైలాడుతూరై, తంజావూరు ఎంపీ సుధా మేడం, కవీంద్ర శర్మ, కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షులు రాణా ప్రతాప్ రాథోడ్ ల తో జూమ్ మీటింగ్లో పాల్గొని అన్ని వివరాలు తీసుకోవడం జరిగిందన్నారు.ఆగస్టు 1 తారీకు నుండి10 తారీకు వరకు కర్ణాటక రాష్ట్రంలో గుల్బర్గాలో నేతృత్వ సంఘం ఆధ్వర్యంలో పది రోజులు ట్రైనింగ్ క్యాంపు ఉంటుందని సూచించినారు.
సీడబ్ల్యూసీ జూమ్ మీటింగ్ లో పాల్గొన్న ఏఎంసీ డైరెక్టర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES