- Advertisement -
- – వెలగని వీధిదీపాలు
– తేల్లు, పాములు ఇండ్ల లోకి
నవతెలంగాణ-పెద్దవూర
స్థానిక సంస్థల ఎన్నికలు జరుగక పోవడం,కేంద్ర 15 వ ఆర్థిక సంఘం నిధులు ఆగిపోవడం తో గ్రామాల్లో వీధిలైట్లు లేక అంధకారంలో మగ్గుతున్నాయి.పంచాయతీల్లో వీధిలైట్ల ఏర్పాటు, నిర్వహణ పాలకవర్గానికి సవాల్గా మారుతోంది. కొత్త వీధిలైట్లు కొందామంటే నిధులు లేవు. మరోవైపు ఇప్పటికే ఉన్న వీధిలైట్ల నిర్వహణ తలకుమించిన భారమైంది.వీధిలైట్లు ఆన్, ఆఫ్ వున్నా కొన్ని గ్రామాల్లో వాటిని పగటిపూట కూడ వెలుగుతున్నాయి.దీంతో విద్యుత చార్జీల భారం పెరిగిపోతుండగా, మరోవైపు విద్యుత వృథా అవుతోంది. ఈపరిస్థితుల్లో వీధిలైట్లు లేని గ్రామాల్లో రాత్రిపూట అంధ కారంలోనే కాలం వెల్లబుచ్చుతున్నారు. - వెలగని వీధిదీపాలు
- మండల పరిధిలోని 26 పంచాయతీలకు 48 అవాస గ్రామాలు ఉన్నాయి. ఈ పంచాయతీలలో చాలా వార్డుల్లో,వీధుల్లో వీధిలైట్లు వెలగక రాత్రిపూట అంధకారంలో జనం అవస్థలు పడుతున్నారు. రాత్రిళ్లు బయటికి రావాలంటే పాములు, తేళ్లు ఎక్కడ కాటేస్తాయోనని భయంతో ఉన్నారు. కేంద్ర ఆర్థిక సంఘం నిధులు రాకపోవడం తో గ్రామ పంచాయతీల్లో నిధులు లేక అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది.ప్రత్యేక అధికారుల పాలనలో అనేక గ్రామ పంచాయతీ సర్పంచులు వీధిలైట్ల కోసం రూ.లక్షల్లో ఖర్చుపెట్టారు. వీధిలైట్ల కొనుగోలు, తాగునీటి బోర్ల మరమ్మతు, డ్రైనేజీ శుభ్రత తదితర వాటికి ఖర్చుపెట్టగా బిల్లులు మాత్రం అందక ఆందోళనలో పడ్డారు.
- అంధకారంలో గ్రామాలు
- మండలంలోని నాయినవాని కుంట, పొట్టేవానితండ, తుంగతుర్తి, ఉట్లపల్లి, గర్నెకుంట, నీమా నాయక్ తండా, జయరాంతండా, పులిచర్ల, పోతునూరు, కోమటికుంట తండా, పర్వేదుల, బట్టుగూడెం, ఇంకా అనేక గ్రామాల్లోని పలు వార్డుల్లో వీధిలైట్లు లేక రాత్రిపూట అంధకారంలో మగ్గుతున్నాయి. సర్పంచుల పదవీకాలం పూర్తి అయి 18 నెలలు అవుతుంది. ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించక పోవడంతో కేంద్ర ఆర్థిక సంఘం నిధులు నిల్చి పోయాయి.మండల కేంద్రానికి మూడు కిలోమీటర్లు దూరంలో వున్న నాయినవానికుంట ఒక చిన్న గ్రామం 100 కుటుంబాలు ఉంటాయి.ఆ గ్రామం లో 14 స్థంబాలకు వీధిలైట్లులేవు.మండలం 53 అవాస గ్రామాలలో అన్ని వార్డులకు లేక రాత్రివేల అంధకారంలో మగ్గుతున్నాయి.వర్షాకాలం ప్రారంభమై వర్షాలు కురుస్తునాయి.ఇప్పటికైన ప్రత్యేక అధికారులు గ్రామాల్లో వీధి లైట్లు వెలిగేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
- Advertisement -