Sunday, June 15, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఅమెరికాలో చట్టసభ సభ్యులే లక్ష్యంగా కాల్పులు..

అమెరికాలో చట్టసభ సభ్యులే లక్ష్యంగా కాల్పులు..

- Advertisement -

– మిన్నెసోటా ప్రతినిధి మృతి
– పోలీసు అధికారి వేషంలో వచ్చిన దుండగుడు
వాషింగ్టన్‌:
అమెరికాలో చట్టసభ సభ్యులే లక్ష్యంగా కాల్పులు కలకలం రేపాయి. ఓ ఆగంతుకుడు జరిపిన కాల్పుల్లో మిన్నెసోటా స్టేట్‌ రిప్రజెంటేటివ్‌ మెలిస్సా హర్ట్‌మన్‌, ఆమె భర్త మార్క్‌ మ ృతి చెందారు. స్టేట్‌ సెనెటర్‌ జాన్‌ హఫ్‌మన్‌, ఆయన సతీమణిపైనా కాల్పులు జరపగా.. వారికి తీవ్ర గాయాలయ్యాయి. చాంప్లిన్‌, బ్రూక్లిన్‌ పార్క్‌లోని వారి వారి నివాసాల వద్ద ఈ కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది. వీటిని రాజకీయ హత్యలుగా అనుమానిస్తున్నామని మిన్నెసోటా గవర్నర్‌ టిమ్‌ వాల్జ్‌ వెల్లడించారు. పోలీసు అధికారి వేషంలో వచ్చిన వ్యక్తి ఈ దాడులకు పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, అతడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్టు అధికారులు తెలిపారు. చట్టసభ సభ్యులపై కాల్పులను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఖండించారు. ఇవి భయంకరమైన కాల్పులుగా పేర్కొన్న ఆయన.. ఈ ఘటనపై ఎఫ్‌బీఐ దర్యాప్తు చేస్తుందన్నారు. డెమోక్రటిక్‌ నేత మెలిస్సా హర్ట్‌మన్‌ గతంలో స్పీకర్‌గా పనిచేశారు. తొలిసారి ఆమె 2004లో చట్టసభలో అడుగుపెట్టారు. బ్రూక్లిన్‌ పార్క్‌లో నివసిస్తున్న హర్ట్‌మన్‌ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -