
– నష్టపోయిన వారిని అదుకుంటం..
– సుడిగాలి పర్యటన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి..
నవతెలంగాణ – డిచ్ పల్లి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని బి.ఆర్.ఎస్ ప్రభుత్వం రైతులకు ఎలాంటి లబ్ధి చేకుర్చ కుండా నల్ల చట్టాలను తీసుకుని వచ్చి వేలాదిమంది రైతుల ప్రాణాలు బలి తీసుకుందని, నేడు రైతులపై కపట ప్రేమ చుయిస్తూ మొసలి కన్నీరు కారుస్తూ దొంగ దీక్షలు చేస్తున్నారని, ఒకసారి చట్టాలు చేసిన తర్వాత రైతుల ఆందోళన నేపథ్యంలో నల్ల చట్టాలను వెనక్కు తీసుకోవడం చరిత్రలోనే ఎప్పుడు జరగలేదని, అప్పటికే వీరాజ్ మంది రైతులు ప్రాణాలు బలి తీసుకున్నారని, అలాంటి వారు కాంగ్రెస్ పార్టీని విమర్శించడం మానుకోవాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు. శుక్రవారం డిచ్ పల్లి మండలం లోని దుస్ గం, ఇందల్ వాయి మండలం లోని ఇందల్ వాయి,ఇందల్ వాయి తండా, గండి తండా,సామ్య నాయక్ తండా,గన్నరం తోపాటు ఇతర గ్రామాల్లో కురిసిన ఆకల వర్షాలకు నష్టపోయిన పంట పొలాలను, నివాస గృహాలను, ధాన్యాం కోనుగోలు కేంద్రాలను, విద్యుత్ లైన్లను తదితర వాటిని శనివారం సుడిగాలి పర్యటన చేసి పరిశీలించారు.


ఇప్పటికే వ్యవసాయ శాఖ రెవెన్యూ విద్యుత్ శాఖ అధికారులతో నష్టపోయిన వివరాలను అందజేసే విధంగా నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి వివరించారు. బాధితులకు కొండంత భరోసా కల్పించారు. ఎమ్మెల్యే వేంట మాజీ ఐడిసిఎంఎస్ చైర్మన్ మునిపల్లి సాయరెడ్డి, పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ముప్పు గంగారెడ్డి, ఇందల్ వాయి, డిచ్ పల్లి మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోత్కురి నవీన్ గౌడ్, అమృత పూర్ గంగాధర్, సహకార సొసైటీ చైర్మన్ చింతల పల్లి గోవర్ధన్ రెడ్డి, వైస్ చైర్మన్ మారుతి, డిసిసి డెలిగేట్ వెంకట్ రెడ్డి, సుధాకర్, సిహెచ్ దాస్, మోహన్ రెడ్డి, చింత శ్రీనివాస్ రెడ్డి, విఠల్ రాథోడ్, దర్మగౌడ్, మాజీ ఉప సర్పంచ్ బైరయ్య, బద్దంరెడ్డి, దశరథ్, రతన్, సుధాకర్, మహిపాల్, సిఈఓ రతన్, డైరెక్టర్లు, మండల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.