మండల వ్యవసాయాధికారి శ్రీజ
నవతెలంగాణ – మల్హర్ రావు : వర్షకాలం 2025 కోసం కొత్తగా పట్టాలు పొంది పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చిన రైతులు ఈ నెల 20 లోపు తమ బ్యాంకు అకౌంట్ వివరాలను రైతు భరోసా పోర్టుల్లో నమోదుకై దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయాధికారిణి బోల్లపల్లి శ్రీజ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు రైతు భరోసా పథకం కోసం కొత్తగా దరఖాస్తు చేసే రైతులు తప్పనిసరిగా వ్యవసాయ శాఖ సూచించిన ఫారం,పట్టాదారు పాసుబుక్ జిరాక్స్,ఆధార్ కార్డు జిరాక్స్,బ్యాంకు అకౌంట్ పాస్ బుక్ జిరాక్స్ తదితర ఆధారాలతో సంబంధించిన క్లస్టర్ వ్యవసాయ విస్తరణాధికారులకు అందచేయాల్సిందిగా అర్హులైన రైతులను కోరుతున్నట్లుగా తెలిపారు.
రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోండి.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES