హీరో విష్ణు మంచు నటిస్తూ, నిర్మించిన పాన్ ఇండియా చిత్రం ‘కన్నప్ప’. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద ఎం. మోహన్ బాబు నిర్మించారు. ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఈ నెల 27న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. శనివారం కొచ్చిలో ట్రైలర్ను రిలీజ్ చేశారు. మోహన్లాల్ మాట్లాడుతూ, ‘ప్రస్తుతం అంతా పాన్ ఇండియన్ ట్రెండ్ నడుస్తోంది. భాషా హద్దుల్లేకుండా సినిమాల్ని తీస్తున్నారు. ‘కన్నప్ప’ చిత్రం అద్భుతంగా వచ్చింది. ఇంత మంచి చిత్రంలో నేను కూడా భాగమైనందుకు ఆనందంగా ఉంది. శివుడుకి కన్నప్ప గొప్ప భక్తుడు. అలాంటి గొప్ప భక్తుడి కథను ఎంతో గొప్పగా నిర్మించారు’ అని అన్నారు.
మోహన్ బాబు మాట్లాడుతూ, ‘ఈ మూవీ కోసం ఇంత వరకు మోహన్లాల్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఆయన చూపించిన ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ‘తుడరుమ్’ కంటే ఎక్కువ కలెక్షన్స్ ఇవ్వాలని మోహన్లాల్ అభిమానుల్ని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
విష్ణు మంచు మాట్లాడుతూ. . ”కన్నప్ప’ గురించి ఇక నేను చెప్పాల్సిన పని లేదు. మీరు ఆల్రెడీ విజువల్స్ చూశారు. ఈ మూవీ ఆ శివుడి ఆశీస్సులతోనే జరిగింది. మా చిత్రం ఈ నెల 27న రాబోతోంది. ట్రైలర్ చూస్తే మోహన్లాల్ పాత్ర ఏంటో అర్థం అవుతోంది. ఆ సర్ ప్రైజ్ ఏంటో నేను ఇప్పుడే చెప్పలేను. మా మూవీని రిలీజ్ చేస్తున్న ఆశీర్వాద్ సినిమాకు థాంక్స్’ అని అన్నారు.
ముఖేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ .. ‘పరుశురాముడు, ఆది శంకరాచార్యులు నడయాడిన నేల ఇది. ఆది శంకరాచార్యులు శివుడికి గొప్ప భక్తుడు. కన్నప్ప కూడా గొప్ప శివ భక్తుడు. సినిమాను అందరూ ప్రేమతో, ఇష్టంతో తీస్తారు. మేం మాత్రం ఈ మూవీని శివుడికి ఓ ప్రార్థనలా తీశాం. శివతత్త్వాన్ని చాటేలా ఈ మూవీని తీశాం ‘ అని అన్నారు.
శివుడికి ఓ ప్రార్థనలా చేసిన సినిమా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES