– నాగర్కర్నూల్ జిల్లాలో ఘటన
నవతెలంగాణ- వెల్దండ
నీట్ పరీక్షా ఫలితాల్లో మార్కులు తక్కువగా వచ్చాయని యువతి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం నారాయణపూర్ తండాలో ఆదివారం జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపూర్ తండాకు చెందిన ఇస్లావత్ శ్రావణి (17) చైతన్యపురి అపోలో ఫార్మసీలో నీట్ పరీక్ష కోసం శిక్షణ తీసుకొని పరీక్ష రాసింది. నీట్ ఫలితాల్లో మార్కులు తక్కువగా రావడంతో మనస్థాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. వ్యవసాయ పొలానికి వెళ్ళిన తల్లిదండ్రులు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చి చూడగా ఇంట్లో ఉరేసుకొని ఉండటాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. కాగా, రెండో ప్రయత్నంలోనూ నీటిలో మంచి ర్యాంకు రాకపోవడంతో ఆత్మహత్య చేసుకుందని స్థానికులు తెలిపారు.
నీట్లో ర్యాంక్ రాలేదని యువతి ఆత్మహత్య..
- Advertisement -
- Advertisement -