- Advertisement -
నవతెలంగాణ – భైంసా: దేగాం గ్రామానికి చెందిన ఒడ్డె రమేష్ ప్రేమల దంపతుల కుమారుడు సాత్విక్ బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. రెండు సంవత్సరాలుగా ఆస్పత్రుల్లో చికిత్స చేయించి, రూ.15 లక్షల వరకు ఖర్చు చేశారు. చేతిలో చిల్లి గవ్వ లేకపోవడంతో బాధితులు తమను ఆదుకోవాలని కోరారు. మానవత్వంతో గ్రామానికి చెందిన నాయకురాలు సిరం సుష్మ రెడ్డి దాతల సహకారాన్ని కోరారు. వారు రూ.54 వేలు బాధిత కుటుంబానికి అందజేశారు. వీరితో పాటు గ్రామంతో పాటు ఆయా గ్రామానికి చెందిన ప్రజలు తోచినంత ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మానవత్వంతో ముందుకు వచ్చిన దాతలకు కృతజ్ఞతలు చెప్పారు.
- Advertisement -