Tuesday, June 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రికవరీ చేసిన బ్యాగును ప్రయాణికునికి అందజేసిన డిపో మేనేజర్

రికవరీ చేసిన బ్యాగును ప్రయాణికునికి అందజేసిన డిపో మేనేజర్

- Advertisement -

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్  : హుస్నాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో విలువైన వస్తువులతో కూడిన బ్యాగును ప్రయాణికుడు మర్చిపోగా రికవరీ చేసి డిపో మేనేజర్ వెంకన్న సోమవారం హుస్నాబాద్ బస్టాండులో ప్రయాణికుడికి అందజేశారు. ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ .. హుస్నాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హుజురాబాద్ నుండి హుస్నాబాద్ కు వెళ్తున్న క్రమంలో మార్గమధ్యలో సైదాపూర్ లో కుమ్మరి విజయ్ అనే ప్రయాణికుడు బ్యాగ్ తో సహా బస్సు ఎక్కాడు. సుందరగిరిలో ఫోన్ మాట్లాడుతూ.. బస్సు దిగిన సమయంలో బ్యాగును బస్సులోనే మరిచిపోయాడు. ప్రయాణికుడు విజయ్ బస్టాండ్ కంట్రోలర్ నెంబర్ తెలుసుకొని కంట్రోలర్ కు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. దీంతో కంట్రోలర్ కండక్టర్ కు సమాచారం అందించి, అప్రమత్తం చేయడంతో బ్యాగును రికవరీ చేశారు. బ్యాగులో మూడు తులాల బంగారం, ఒక మొబైల్ ఫోన్, బట్టలు సురక్షితంగా ఉండటంతో ప్రయాణికుడు ఊపిరి పీల్చుకున్నాడు. సురక్షితంగా బ్యాగును అందించిన ఆర్టీసీ సిబ్బందిని అభినందించారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణికులను గమ్యస్థానానికి సురక్షితంగా చేరవేయడంతోపాటు బస్సులో మార్చిపోయిన వారి వస్తువులను కూడా సురక్షితంగా అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో  కండక్టర్ సాగర్, డ్రైవర్ ఆంజనేయులు, ట్రాఫిక్ సూపరిండెంట్ మురళి, కంట్రోలర్లు అబ్రహం, శేఖర్, సెక్యూరిటీ వెంకటేష్ ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -