Tuesday, June 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కార్మికుల హక్కులకు గొడ్డలి పెట్టు లాంటివి లేబర్ కోడ్స్..

కార్మికుల హక్కులకు గొడ్డలి పెట్టు లాంటివి లేబర్ కోడ్స్..

- Advertisement -

టి.యు.సి.ఐ రాష్ట్ర ప్రథమ మహాసభలను జయప్రదం చేయండి..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ కార్మిక వర్గ హక్కులకు గొడ్డలి పెట్టు లాంటివని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టియుసిఐ) సూర్యాపేట జిల్లా అధ్యక్షులు గొడ్డలి నర్సయ్య అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ విక్రమ్ భవన్ వద్ద నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈ నెల 21,22 వ తేదీలలో జరిగే టియుసిఐ రాష్ట్ర ప్రథమ మహాసభల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రెండవసారి అధికారంలోకి వచ్చిన మతోన్మాద బిజెపి ప్రభుత్వం మతం పేరుతో కులం పేరుతో ప్రజలను విడదీస్తూ, ఫాసిస్టు విధానాలను అనుసరిస్తుందని దుయ్యబట్టినారు. ఈ కొత్త లేబర్ కోడ్స్ కార్మిక వర్గ హక్కులకు గొడ్డలి పెట్టు లాంటివని ఆయన ఆవేదన చెందారు. చికాగో నగరంలో చిందిన వెచ్చటి నెత్తురు సాక్షిగా సాధించుకున్న ఎనిమిది గంటల పని హక్కును, కేంద్ర ప్రభుత్వం 12 గంటలకు పెంచడము అంటే కార్మిక వర్గ హక్కులను పరిహాసించడమే అని అన్నారు. దేశములోని 40 కోట్ల కార్మికులను ఈ చర్య ద్వారా అవమానపరిచారని ఆయన ఆరోపించారు. కార్మిక హక్కులను కాలరాచిన ఏ ప్రభుత్వము చరిత్రలో మనగడ సాధించలేదని ఆయన గుర్తు చేశారు. భారత కార్మిక వర్గానికి అద్భుత పోరాట శక్తి ఉందని, ఆ పోరాట శక్తితో లేబర్ కోడ్స్ రద్దయేంతవరకు ఉద్యమించి, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి లేబర్ కోడ్స్ రద్దు చేయించుకునే శక్తి కార్మిక వర్గానికి ఉన్నదని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. లాభాల బాటలో నడుస్తున్న ప్రభుత్వ పారిశ్రామిక రంగాన్ని దివాలా తీయించి, బడా పారిశ్రామికవేత్తలకు ధారా దత్తం చేయడాన్ని కార్మిక వర్గం ఓడించి తీరుతుందని ఆయన అన్నారు. అందులో భాగంగానే దేశంలోని కొన్ని కార్మిక సంఘాలను ఐక్యం చేసి టియుసిఐ గా ఏర్పడినటువంటి కార్మిక సంఘం రాష్ట్రంలో తన ప్రధమ మహాసభను ఈనెల 21,22వ తేదీలలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరుపుకుంటుందని తెలియజేశారు. ఈ మహాసభలలో కార్మిక లోకం అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేసినారు. ఈ కార్యక్రమంలో టియుసిఐ జిల్లా సహాయ కార్యదర్శి గోగుల వీరబాబు, కోశాధికారి ఐతరాజు వెంకన్న, జిల్లా నాయకులు సాహెబ్ హుస్సేన్, జక్కుల శేషగిరి, శ్రీను,నగేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -