Tuesday, June 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులకు సన్మానం..

విద్యార్థులకు సన్మానం..

- Advertisement -

నవతెలంగాణ – దుబ్బాక : టెన్త్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి మండల టాపర్ గా నిలిచిన విద్యార్థులు మల్యాల రేవతి, స్కూల్ సెకండ్ వచ్చిన షేర్ల సాయిచరణ్ లను ఎంఈఓ డీ.అంజయ్య చేతుల మీదుగా శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం ఇదే పాఠశాలలో మాథ్స్ టీచర్ గా పనిచేస్తున్న కూరాకుల శ్రీనివాస్ ఆ విద్యార్థులకు ప్రోత్సాహకంగా నగదు బహుమతిని అందజేశారు. అక్బర్ పేట భూంపల్లి మండలం రామేశ్వరంపల్లి జడ్పీహెచ్ఎస్ లో సోమవారం నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో భాగంగా ఎంఈఓ డీ.అంజయ్య ముఖ్య అతిథిగా హాజరైనారు. అనంతరం పాఠశాలకు ప్రభుత్వం అందజేసిన నూతన డెస్క్ లను హెచ్ఎం నీలం శ్రీనివాస్ తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను, హెచ్ఎం శ్రీనివాస్ ను, ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో చిన్న నిజాంపేట యూపీయస్ హెచ్ఎం శ్రీధర్, రామేశ్వరంపల్లి పీఎస్ హెచ్ఎం జాన్ కుమార్, కూడవెల్లి పీయస్ హెచ్ఎం శివాజీ, పంచాయతీ సెక్రటరీ రామకృష్ణ, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -