Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్అంబేద్కర్ భవనాన్ని త్వరగా పూర్తి చేయాలని వినతి..

అంబేద్కర్ భవనాన్ని త్వరగా పూర్తి చేయాలని వినతి..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్  : యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవనం వెంటనే పూర్తి చేయాలని కోరుతూ సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావుకి వినతి పత్రం అందజేశారు. గత 2017 సంవత్సరం నాడు శంకుస్థాపన చేసి నేటికీ ఎనిమిది సంవత్సరాలు అవుతుంది. కాంట్రాక్టర్ ల నిర్లక్ష్యం వల్లే జాప్యం జరుగుతుందనీ, నిర్లక్ష్యం చేస్తే శిథిలావస్థకు అయ్యే అవకాశం ఉందని కోరుతూ త్వరగా జ  పెండింగ్ లో ఉన్నటువంటి నిర్మాణ పనులను వెంటనే  పూర్తి చేసి ప్రారంభించి స్టడీ సర్కిల్ సెంటర్ కోచింగ్ సెంటర్ స్కిల్ డెవలప్మెంట్ గ్రంథాలయం, అంబేద్కర్ ఆడిటోరియం లను ప్రజల్లోకి అందుబాటులోకి తేవాలని   కోరినట్లు తెలిపారు. కలెక్టర్ ని కలిసిన వారిలో సీనియర్ అడ్వాకేట్ నాగరం అంజయ్య , డివిఎంసి మెంబర్ బర్రె సుదర్శన్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఇటుకల దేవేందర్ మాదిగ, జిల్లా అధ్యక్షులు దుబ్బ రామకృష్ణ మాదిగ , ఎన్ ఎస్ యు ఐ  జిల్లా ప్రధాన కార్యదర్శి సురుపంగా చందులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad