Wednesday, June 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డేంజర్ జోన్లో ఉన్న ఇండ్లకు పరిహారం, ప్యాకేజి ఇవ్వాలి: డిప్యూటీ సీఎం

డేంజర్ జోన్లో ఉన్న ఇండ్లకు పరిహారం, ప్యాకేజి ఇవ్వాలి: డిప్యూటీ సీఎం

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
తాడిచర్ల ఓసిపి బ్లాక్-1కు డేంజర్ జోన్లో ఉన్న ఇండ్లకు పరిహారం,ఆర్అండ్ఆర్ ప్యాకేజి ఇప్పించాలని భూ నిర్వాసితుల సంఘం అధ్యక్షుడు దండు రమేష్ ఆధ్వర్యంలో రాష్ట్ర డిప్యూటీ, ఆర్థిక, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క కు మంగళవారం వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా నిర్వాసితులు మాట్లాడారు. కాకతీయ థర్మల్ పవర్ ప్లాంటు చెల్పూర్ బొగ్గు నిల్వల వెలికితీతలో భాగంగా తేది 20-10-2008 రోజున అప్పటి ఎపి జెన్కో ఆధ్వర్యంలో తాడిచెర్ల గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడం జరిగిందన్నారు. ఆ సమయంలో ఉపరితల బొగ్గు గనుల విస్తరణ నిమిత్తమై తాడిచెర్ల, కాపురం శివారులోని 2,300 ఎకరాల విస్తీర్ణం గల వ్యవసాయ భూములు అవసరమని, భూమికి మంచి రేటు ఇస్తామని, మిగులు భూములు కూడా తీసుకుంటామని, ప్రాజెక్టు బౌండరీ నుండి 500 మీటర్ల వరకు ప్రకటించిన డేంజర్ జోన్లోని నివాస గృహాలను సేకరించి పునరావాసం కల్పిస్తామని జెన్కో కంపెనీ మోసం చేసిందన్నారు.

గత ప్రభుత్వ హయాంలో గెజిట్ నెం.39/2022 ద్వారా తేది 13-12-2022 రోజున మూడు జాతీయ దినపత్రికలలో ప్రైమరీ నోటిఫికేషన్ జారీ చేసి నివాస గృహాలకు ప్రాజెక్ట్ నెంబర్లు కెటాయించి ఇంటి స్థలాల సర్వే నిర్వహించడం జరిగిందన్నారు.కానీ ఇప్పటి వరకు అట్టి నోటిఫికేషన్పై ఎలాంటి పురోగతి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఓసిపి బ్లాస్టింగ్ దెబ్బలతో ఉపరితల బొగ్గు గని వలన దుమ్ము, ధూళి, భూమి పొరల్లో నుండి విష వాయువుల వలన మాకు అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. అలాగే బొగ్గు నిల్వలు వెలికి తీస్తున్న క్రమంలో మోతాదుకు మించి బ్లాస్టింగ్లు చేయడం వలన గనికి సమీపంలో గల మా నివాస గృహాలు కూలిపోతూ మేము ప్రమాదాలకు గురి అవుతున్నామని చెప్పారు.కావున పెద్ద మనసుతో ప్రత్యేక చొరవ చూపి డేంజర్ జోన్లో వున్న నివాస గృహాలను సేకరించి మాకు సురక్షిత ప్రాంతంలో ఇంటి స్థలాలు కెటాయించి మా గృహాలకు చట్టప్రకారం నష్టపరిహారం ఇప్పించి మమ్ముల్ని ఆదుకోవాలని వేడుకొంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -