- Advertisement -
నవతెలంగాణ-ఆర్మూర్
పట్టణంలో జెంటిల్ కిడ్స్ పాఠశాలలో ఆషాడ మాస గోరింటాకు సంబరాలు శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ప్రకాష్ , ప్రిన్సిపాల్ లతా పాల్గొని ఆషాడ మాసంలో వచ్చే పండుగ హిందువులు జరుపుకునే తొలి పండుగ తొలి ఏకాదశి నుండి పండుగలు ప్రారంభమవుతాయని పిల్లలకు వివరించారు. ఈ సందర్భంగా పిల్లలందరూ సాంప్రదాయ దుస్తులలో వచ్చి గోరింటాకు పెట్టుకొంటూ ఆనందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు మరియు వివిధ రకాల సంస్కృతి కార్యక్రమాలతో అందరినీ అలరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
- Advertisement -


